దారుణం.. రోడ్డుపైనే శిశువును ప్రసవించిన 14 ఏళ్ల మైనర్‌ బాలిక.. చలికి చనిపోయిన పసికందు

Dumped by teenager, infant dies of cold in Ludhiana. లుధియానాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మంగళవారం నాడు సేలం తబ్రీ ప్రాంతంలో అత్యాచారానికి గురైన 14 ఏళ్ల మైనర్‌ బాలిక గర్భం

By అంజి  Published on  15 Dec 2021 7:25 AM GMT
దారుణం.. రోడ్డుపైనే శిశువును ప్రసవించిన 14 ఏళ్ల మైనర్‌ బాలిక.. చలికి చనిపోయిన పసికందు

లుధియానాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మంగళవారం నాడు సేలం తబ్రీ ప్రాంతంలో అత్యాచారానికి గురైన 14 ఏళ్ల మైనర్‌ బాలిక గర్భం దాల్చడంతో.. నవజాత శిశువును ప్రసవించింది. ఖాళీ స్థలంలో పడేయడంతో శిశువు మరణించింది. విషయం తెలుసుకున్న పోలీసులు.. శిశువును పోస్టుమార్టం కోసం సివిల్ ఆసుపత్రికి పంపారు. మైనర్‌ బాలికపై అత్యాచారం చేసిన వ్యక్తిపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ కూడా నమోదు చేశారు. మైనర్ బాలిక అత్యాచారం గురించి అధికారులకు ఫిర్యాదు చేయలేదు. ఓ స్థానిక వ్యక్తి అధికారులకు ఫోన్‌ చేసి.. మైనర్‌ తల్లి.. తన శిశువును నాసిరకం షీట్‌లో చుట్టి పడేసిందని చెప్పారు.

శిశువు చుట్టూ కుక్కల గుంపు గుమిగూడడంతో బాటసారులు చిన్నారి ఉనికిని గమనించి అప్రమత్తం చేశారు. ప్లాట్‌లో ఏదో విసిరినట్లు గుర్తించినట్లు స్థానికులు తెలిపారు. బాధితురాలు సీసీటీవీ కెమెరాలో కూడా రికార్డైంది. తనకు తెలిసిన ఓ వ్యక్తి తనతో శారీరక సంబంధాలు ఏర్పరచుకుని గర్భం దాల్చానని మైనర్‌ బాలిక చెప్పినట్లు స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఇన్‌స్పెక్టర్ రమణదీప్ సింగ్ తెలిపారు. తరువాత నిందితుడు పారిపోయాడని, మైనర్‌ బాలిక సోమవారం ఒంటరిగా ఆడబిడ్డకు జన్మనిచ్చిందని తెలిపారు.

సామాజిక అపకీర్తిని నివారించడానికి బాధితురాలు నవజాత శిశువును ప్లాట్‌లో పడేసింది. మైనర్‌ బాలిక బాధితురాలైనందున.. తన బిడ్డను విడిచిపెట్టినందుకు ఆమెపై ఎటువంటి కేసు నమోదు కాలేదు. అత్యాచార నిందితుడిపై భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్లు 315 (పిల్లలు సజీవంగా పుట్టకుండా లేదా పుట్టిన తర్వాత చనిపోయేలా చేసే ఉద్దేశ్యంతో చేసిన చర్య) , లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ (పోక్సో) చట్టం కింద కేసు నమోదు చేయబడింది. నిందితుడిని పోలీసులు త్వరలో గుర్తించి పట్టుకోనున్నారు.

Next Story