ఘోర రోడ్డు ప్రమాదం.. రాజ్యసభ ఎంపీ కుమారుడు మృతి

DMK Rajya Sabha MP's son killed in road accident. తమిళనాడుకు చెందిన ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) రాజ్యసభ ఎంపీ ఎన్‌ఆర్‌ ఇళంగోవన్‌ కుమారుడు 22 ఏళ్ల రాకేష్‌ గురువారం

By అంజి  Published on  10 March 2022 3:21 AM GMT
ఘోర రోడ్డు ప్రమాదం.. రాజ్యసభ ఎంపీ కుమారుడు మృతి

తమిళనాడుకు చెందిన ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) రాజ్యసభ ఎంపీ ఎన్‌ఆర్‌ ఇళంగోవన్‌ కుమారుడు 22 ఏళ్ల రాకేష్‌ గురువారం రోడ్డు ప్రమాదంలో మరణించాడు. రాకేష్, అతని స్నేహితుడు పుదుచ్చేరికి వెళుతుండగా వారు ప్రయాణిస్తున్న వాహనం అదుపు తప్పి రోడ్డు డివైడర్‌ను ఢీకొట్టినట్లు పోలీసులు తెలిపారు. వాహనం బోల్తా పడి రాకేష్ అక్కడికక్కడే మృతి చెందగా అతని స్నేహితుడు తీవ్రంగా గాయపడ్డాడు. మార్చి 10, 2022, గురువారం తెల్లవారుజామున ఈస్ట్ కోస్ట్ రోడ్‌లోని కొత్తకుప్పం సమీపంలోని కిల్ పుతుపేట్ వద్ద డివైడర్‌ను వారు ప్రయాణిస్తున్న వాహనం ఢీకొనడంతో ఎంపీ కుమారుడు రాకేష్ మరణించాడు. ఈ ప్రమాదం తెల్లవారుజామున 3.45 గంటలకు జరిగింది. సమాచారం అందుకున్న కొత్తకుప్పం నుండి ఒక పోలీసు బృందం సంఘటనా స్థలానికి చేరుకుని వాహనాన్ని తెరిచి రాకేష్ మృతదేహాన్ని వెలికితీసింది. తీవ్రంగా గాయపడిన మృతుడి స్నేహితుడిని పుదుచ్చేరి సమీపంలోని కనగచెట్టికులం వద్ద ఉన్న పాండిచ్చేరి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (పిమ్స్)కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Next Story