సోషల్ మీడియాలో వ్యక్తులను నమ్మితే.. 18 ఏళ్ల యువతిని ఏమి చేశారంటే?

దక్షిణ ఢిల్లీలోని మదంగిర్‌కు చెందిన 18 ఏళ్ల యువతిపై దేశ రాజధానిలోని మాల్వియా నగర్ ప్రాంతంలో ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు

By Medi Samrat  Published on  2 Feb 2024 4:00 PM GMT
సోషల్ మీడియాలో వ్యక్తులను నమ్మితే.. 18 ఏళ్ల యువతిని ఏమి చేశారంటే?

దక్షిణ ఢిల్లీలోని మదంగిర్‌కు చెందిన 18 ఏళ్ల యువతిపై దేశ రాజధానిలోని మాల్వియా నగర్ ప్రాంతంలో ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. మీరట్‌లో పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. ప్రాణాలతో బయటపడిన అమ్మాయి ఫిర్యాదు ప్రకారం.. జనవరి 29 (సోమవారం) మధ్యాహ్నం 1 గంట సమయంలో, ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ ఫ్రెండ్స్ అయిన నిందితులు ఆమెను మదంగిర్‌లోని ఒక ప్రాంతానికి పిలిచారు. ఇద్దరు ద్విచక్ర వాహనంపై ఆమె కోసం వేచి ఉన్నారు. ఆమె వచ్చింది.. వారు ఆమెను బైక్ పై కూర్చోమని అడిగారు. దానికి ఆమె నిరాకరించింది.

అయితే నిందితులు ఆమెను బెదిరించి, బలవంతంగా మాల్వీయా నగర్‌కు తీసుకెళ్లారు. అక్కడ భోజనంలో మత్తుమందు కలిపినట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొంది. ఆ తర్వాత తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపించింది. ఫిర్యాదులో భాగంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మీరట్‌కు ఒక బృందాన్ని పంపారు. గురువారం రాత్రి ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘటనను ధృవీకరిస్తూ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (సౌత్) అంకిత్ చౌహాన్ మాట్లాడుతూ.. ఇద్దరు నిందితులు 19, 21 సంవత్సరాల వయస్సు ఉన్నోళ్లేనని తెలిపారు. జనవరి 29న జరిగిన ఘటనపై మహిళ పోలీసులకు సమాచారం అందించిందని, ఈ కేసుకు సంబంధించి తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని ఆయన చెప్పారు.

Next Story