డ్రగ్ ఫ్రీ ఇండియా క్యాంపెయిన్ కింద ఢిల్లీ పోలీసుల క్రైమ్ బ్రాంచ్కు చెందిన యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ (ANTF) భారీ విజయాన్ని సాధించింది. ఈ బృందం అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లింగ్ ముఠాను ఛేదించింది. 348.176 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుంది. దీని మార్కెట్ విలువ సుమారు రూ. 1.75 కోట్లు. ఈ గంజాయిని ఆంధ్రప్రదేశ్ నుంచి ఢిల్లీకి తీసుకువస్తున్నారని, పుచ్చకాయలతో కూడిన ట్రక్కు కింద గంజాయి దాచి ఉంచారని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ అపూర్వ గుప్తా తెలిపారు.
మే 20, 2025న ఢిల్లీలోని సోనియా విహార్ మీదుగా భారీ మొత్తంలో గంజాయిని తీసుకెళ్తున్న ట్రక్ వెళ్లబోతోందని ANTFకి సమాచారం అందింది. ఈ సమాచారంపై క్రైమ్ బ్రాంచ్ బృందాన్ని ఏర్పాటు చేసి మే 21 తెల్లవారుజామున 2 గంటలకు సోనియా విహార్లోని పుస్తా రోడ్లో ట్రక్కును నిలిపివేశారు. లారీని సోదా చేయగా అందులో పుచ్చకాయల కింద దాచిన 17 ప్లాస్టిక్ బ్యాగులు కనిపించాయి. విచారణలో అది గంజాయి అని నిర్ధారించారు.
ఘటనా స్థలంలో ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొదటి నిందితుడు ఇంతేజార్ మాలిక్ (31 సంవత్సరాలు) ఘజియాబాద్ నివాసి. గత 4-5 సంవత్సరాలుగా గంజాయి స్మగ్లింగ్కు పాల్పడుతున్నాడు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో ఎన్డిపిఎస్ చట్టం కింద అరెస్టయ్యాడు.
రెండో నిందితుడు రిజ్వాన్ (32 ఏళ్లు) లోని నివాసి. ట్రక్ డ్రైవర్గా స్మగ్లింగ్లో పాల్గొన్నాడు. నిందితులిద్దరినీ కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. పోలీసులు ఈ మొత్తం స్మగ్లింగ్ నెట్వర్క్పై విచారణ జరుపుతున్నారు.