అల్లూరి జిల్లాలో టిప్పర్ బోల్తా.. ఐదుగురు మృతి

By Medi Samrat
Published on : 25 Nov 2023 5:39 PM IST

అల్లూరి జిల్లాలో టిప్పర్ బోల్తా.. ఐదుగురు మృతి

అల్లూరి జిల్లా ఏవోబీలో విషాదం చోటు చేసుకుంది. సిమెంట్ లారీ బోల్తా పడిన ఘటనలో ఐదుగురు మృతి చెందారు. ఏవోబీ కటాఫ్ ఏరియాలోని హంతల్‌గూడ ఘాట్‌ రోడ్డులో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మరో 10 మందికి తీవ్రగాయాలవ‌గా.. వారిని వెంట‌నే ఆసుప‌త్రికి త‌ర‌లించారు. చిత్రకొండ నుంచి జడంబోకు సిమెంట్‌ లోడు తీసుకెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు స్థానికులు వెల్లడించారు. ప్రమాద ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా ప్రదేశానికి చేరుకున్న పోలీసులు సహాయక‌ చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను టిప్పర్ నుంచి బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం అందేలా చర్యలు చేపట్టనున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Next Story