స్టాక్ మార్కెట్‌లో లాభాల పేరుతో రూ.85 లక్షలు మోసం

Businessman duped of Rs 85 lakh in Hyderabad. సైబర్ నేరగాళ్లు హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్తను రూ.85 లక్షలు మోసం చేశారు.

By Medi Samrat  Published on  22 Feb 2022 9:06 AM GMT
స్టాక్ మార్కెట్‌లో లాభాల పేరుతో రూ.85 లక్షలు మోసం

సైబర్ నేరగాళ్లు హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్తను రూ.85 లక్షలు మోసం చేశారు. స్టాక్ మార్కెట్‌లో నకిలీ పెట్టుబడి పథకంతో మోసగాళ్లు తనను మోసగించారని బాధితుడు సూర్యాపేటకు చెందిన ప్రభాకర్ రెడ్డి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రభాకర్ రెడ్డికి 2017లో కంపెనీ ఎగ్జిక్యూటివ్‌గా చెప్పుకునే ఒక మహిళ నుంచి కాల్ వచ్చింది. ఆన్‌లైన్ షేర్ ట్రేడింగ్‌లో పెట్టుబడులు పెట్టాలని ప్రభాకర్‌ను కోరింది, అతనికి భారీ లాభాలు వస్తాయని వాగ్దానం చేసింది. ఆమెను నమ్మిన రెడ్డి రూ. 85 లక్షలను పెట్టుబడిగా పెట్టి కాలర్ షేర్ చేసిన వివిధ బ్యాంకు ఖాతాలకు న‌గ‌దు బదిలీ చేశాడు.

లాభాలు బదిలీ చేయమని ప్రభాకర్ రెడ్డి స‌ద‌రు మోసగాళ్ల‌ను అడగడంతో అస‌లు మోసం వెలుగులోకి వచ్చింది. మోసపోయానని తెలుసుకున్న ప్రభాకర్‌రెడ్డి వెంట‌నే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. బాధితురాలు ప్రభాకర్ రెడ్డికి అందించిన బ్యాంకు ఖాతాలు బెంగళూరు నుంచి నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ప్ర‌స్తుతం పోలీసులు మోసగాళ్లను పట్టుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.


Next Story