ముస్సోరీ-డెహ్రాడూన్ రహదారి.. లోయలో పడ్డ బస్సు

Bus With 22 Onboard Falls Into Ditch In Uttarakhand. ముస్సోరీ-డెహ్రాడూన్ రహదారిపై ఆదివారం బస్సు లోయలో పడింది.

By Medi Samrat  Published on  2 April 2023 12:30 PM GMT
ముస్సోరీ-డెహ్రాడూన్ రహదారి.. లోయలో పడ్డ బస్సు

ముస్సోరీ-డెహ్రాడూన్ రహదారిపై ఆదివారం బస్సు లోయలో పడింది. ఈ ఘటనలో బస్సు డ్రైవర్‌తో సహా 22 మంది గాయపడ్డారని పోలీసులు తెలిపారు. ముస్సోరీ-డెహ్రాడూన్ మార్గంలో రోడ్డు మార్గంలో వెళుతున్న బస్సు అదుపు తప్పి లోయలో పడింది. దీనికి సంబంధించిన రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోంది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది & అంబులెన్స్ సహాయ కార్యక్రమాలు మొదలుపెట్టారు.

ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీసుల (ఐటీబీపీ) సహాయంతో క్షతగాత్రులందరినీ రక్షించి చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు ముస్సోరీ పోలీసులు తెలిపారు. ముగ్గురు ప్రయాణికుల పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


Next Story