చెత్త కుప్పలో నవజాత శిశువు మృత‌దేహం

హైద‌రాబాద్‌ అశోక్ నగర్‌లోని ఎన్టీఆర్ స్టేడియం సమీపంలో రోడ్డు పక్కన ఉన్న చెత్త కుప్పలో కాలిపోయిన నవజాత శిశువు అవశేషాలు కనిపించాయి.

By Medi Samrat
Published on : 17 March 2025 9:30 PM IST

చెత్త కుప్పలో నవజాత శిశువు మృత‌దేహం

హైద‌రాబాద్‌ అశోక్ నగర్‌లోని ఎన్టీఆర్ స్టేడియం సమీపంలో రోడ్డు పక్కన ఉన్న చెత్త కుప్పలో కాలిపోయిన నవజాత శిశువు అవశేషాలు కనిపించాయి. సమాచారం ప్రకారం, స్థానికులు మంటల్లో ఉన్న మృతదేహాన్ని చూసి దోమల్‌గూడ పోలీసులకు సమాచారం అందించగా, వారు మృతదేహాన్ని శవపరీక్ష కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశారు.

మరణించిన శిశువును పడేసి ఆ తర్వాత దహనం చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. తల్లిదండ్రులను కనుగొనడానికి సమీపంలోని ఆసుపత్రులలో ఇటీవలి ప్రసవ రికార్డులను వారు తనిఖీ చేస్తున్నారు. అలాగే సీసీటీవీ ఫుటేజీలను కూడా గమనిస్తూ ఉన్నారు.

Next Story