తల్లితో కలిసి భర్తను ప్లాన్ ప్రకారం మర్డర్ చేసిన భార్య
రియల్ ఎస్టేట్ ఏజెంట్, లోన్ కన్సల్టెంట్ అయిన 37 ఏళ్ల లోక్నాథ్ సింగ్ బెంగళూరు నగరంలో హత్యకు గురయ్యాడు.
By Medi Samrat
రియల్ ఎస్టేట్ ఏజెంట్, లోన్ కన్సల్టెంట్ అయిన 37 ఏళ్ల లోక్నాథ్ సింగ్ బెంగళూరు నగరంలో హత్యకు గురయ్యాడు. అతని స్వంత కుటుంబం చేసిన ద్రోహం, ప్రణాళిక ప్రకారం హత్య కేసుగా అభివర్ణించారు. ఈ నేరానికి సంబంధించి అతని భార్య యశస్విని, అత్త హేమా బాయిని అరెస్టు చేశారు.
మార్చి 22న సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో, పోలీసులకు అత్యవసర నంబర్ 112కు కాల్ వచ్చింది. అక్కడికి చేరుకున్న తర్వాత, లోక్నాథ్ మృతదేహాన్ని ఆపి ఉంచిన కారులో కనుగొన్నారు. అతని గొంతు కోసి ఉంది. ఈ హత్య వెనుక వ్యక్తిగత, ఆర్థిక వివాదాలు ఉన్నాయని పోలీసులు గుర్తించారు. లోకనాథ్ యశస్వినితో రెండేళ్లుగా రిలేషన్ షిప్ లో ఉన్నాడు. ఆ తర్వాత వారు డిసెంబర్ 2024లో కునిగల్లో రిజిస్టర్డ్ వివాహం చేసుకున్నారు. అయితే, ఈ వివాహాన్ని ఆమె కుటుంబం నుండి దాచిపెట్టారు. ఈ జంట మధ్య గణనీయమైన వయస్సు అంతరం కారణంగా ఈ పెళ్లిని తీవ్రంగా వ్యతిరేకించారు. వివాహం తర్వాత, లోకనాథ్ తన భార్యను ఆమె తల్లిదండ్రుల ఇంట్లో వదిలి వెళ్ళాడు, ఆమె కుటుంబానికి వారి వివాహం గురించి తెలియకుండా ఉండేలా చూసుకున్నాడు.
రెండు వారాల క్రితం యశస్విని కుటుంబం నిజం తెలుసుకోగా.. నాటకీయ మలుపు తిరిగింది. ఈ విషయం బయటపడటంతో పాటు లోక్నాథ్ వివాహేతర సంబంధాలు, వ్యాపార లావాదేవీల మీద చర్చ జరిగింది. దీంతో ఉద్రిక్తతలు పెరిగాయి, విడాకుల చర్చలు ప్రారంభమయ్యాయి. లోక్నాథ్ తన భార్య, అత్తని బెదిరించడం ప్రారంభించాడని పోలీసులు తెలిపారు. దీంతో చివరికి వారే అతడి హత్యకు ప్రణాళిక వేశారు.
నిందితులు మొదట లోక్నాథ్ ఆహారంలో నిద్ర మాత్రలు కలిపి మత్తుమందు ఇచ్చారు. ఆ తర్వాత యశస్విని మాట్లాడుకుందామని చెప్పి చిక్కబనవరానికి రప్పించింది. ఆమె తల్లి ఆటో రిక్షాలో దగ్గరగా వెంబడించింది. ఏకాంత ప్రదేశంలోకి చేరుకున్నాక యశస్విని, ఆమె తల్లి కలిసి కారు లోపల లోక్నాథ్ గొంతు కోసి అక్కడి నుండి పారిపోయారు.
లోక్నాథ్ సోదరుడు ఫిర్యాదు చేయడంతో ఈ హత్య వెలుగులోకి వచ్చింది. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. విచారణలో అతని హత్య వెనుక ఉన్న దిగ్భ్రాంతికరమైన నిజం బయటపడింది. లోక్నాథ్ మీద మోసం కేసు బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ దర్యాప్తులో ఉందని కూడా తేలింది.
అరెస్టులను ధృవీకరిస్తూ, వెస్ట్ డివిజన్ అదనపు కమిషనర్ విశాల్ కుమార్ బికాష్ మాట్లాడుతూ, “తన భర్త, రియల్ ఎస్టేట్ వ్యాపారి లోక్నాథ్ సింగ్ హత్య కేసులో యశస్విని (21), ఆమె తల్లి హేమా బాయి (37)లను అరెస్టు చేశారు. మృతుడి సోదరుడు దాఖలు చేసిన ఫిర్యాదు ఆధారంగా నిందితులను అరెస్టు చేశారు. మృతుడికి వివాహేతర సంబంధం ఉందని ఆరోపించారు. విడాకుల గురించి కూడా చర్చ జరిగింది. లోక్నాథ్ సింగ్ తన అత్త, భార్యను అంతకు ముందు బెదిరించాడు. దీంతో ఇద్దరూ అతని హత్యకు కుట్ర పన్నారు.” అని తెలిపారు. డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (నార్త్) సైదుల్ అదవత్ కూడా కేసును ధృవీకరించారు.