ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర రోడ్డుప్రమాదం.. ఐదుగురు మృతి, 17 మందికి గాయాలు

హ‌ర్యానా రాష్ట్రం బహదూర్‌ఘర్‌లోని నీలోతి గ్రామ సమీపంలోని కెఎంపి ఎక్స్‌ప్రెస్‌వేపై మంగళవారం రాత్రి ఘోర ప్రమాదం జరిగింది

By Medi Samrat
Published on : 20 Aug 2025 10:04 AM IST

ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర రోడ్డుప్రమాదం.. ఐదుగురు మృతి, 17 మందికి గాయాలు

హ‌ర్యానా రాష్ట్రం బహదూర్‌ఘర్‌లోని నీలోతి గ్రామ సమీపంలోని కెఎంపి ఎక్స్‌ప్రెస్‌వేపై మంగళవారం రాత్రి ఘోర ప్రమాదం జరిగింది. ట్రక్కు, పికప్ వాహ‌నం ఢీకొన్న ఘటనలో ఐదుగురు మృతి చెందారు. కాగా 17 మంది గాయపడినట్లు సమాచారం. వీరిలో నలుగురు మహిళలు, ఇద్దరు బాలికలు ఉన్నారు. గాయపడిన వారిలో ఎక్కువ మందిని రోహ్‌తక్‌కు తరలించినట్లు చెప్పారు. ప్రజలంతా ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీ ప్రాంతానికి చెందిన వారని, మహేంద్రగఢ్‌కు వెళ్తున్నారని చెప్పారు. మృతులను గుర్తిస్తున్నారు.

KMP నుండి కత్రా ఎక్స్‌ప్రెస్‌వేకి ఇంటర్‌చేంజ్ సమీపంలో ఈ సంఘటన జరిగింది. ట్రక్కు, పికప్ రెండూ మనేసర్ వైపు వెళ్తున్నాయి. ఢీకొన్న వెంటనే పికప్ వాహ‌నంలో ఉన్న వ్యక్తులు రోడ్డుపై పడిపోయారు. వెంట‌నే కేఎంపీ పోలీస్‌స్టేషన్ వాహ‌నం ఘటనా స్థలానికి చేరుకుంది. ఆస్పత్రికి చేరుకునేలోపే నలుగురు చనిపోయారు. ఐదో వ్యక్తి బుధవారం ఉదయం రోహ్ తక్ పీజీఐలో మరణించాడు. మృతుల కుటుంబాలకు సమాచారం అందించారు. వారు ఇంకా బహదూర్‌ఘర్‌కు చేరుకోలేదు. క్షతగాత్రులను ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం మృతుల పేర్లు, చిరునామాల వివరాలను సేకరిస్తున్నారు.

Next Story