శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు పోలీసులు మృతి
Accident In Srikakulam District. శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పలాస మండలం
By Medi Samrat Published on
23 Aug 2021 9:55 AM GMT

శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పలాస మండలం సుమ్మాదేవి జాతీయ రహదారిపై జరిగిన ఈ దుర్ఘటనలో నలుగురు పోలీసులు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. భైరిసారంగపురంలో ఓ జవాను మృతదేహం అప్పగించి ఏఆర్ కానిస్టేబుళ్లు బొలెరో వాహనంలో వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. రహదారిని క్రాస్ చేస్తుండగా వీరి వాహనాన్ని లారీ ఢీకొంది.
ప్రమాదంలో నలుగురు కానిస్టేబుళ్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో పోలీసుల వాహనం నుజ్జునుజ్జయింది. మృతులు ఏఆర్ ఎస్సై కె.కృష్ణుడు, వై. బాబూరావు (హెడ్ కానిస్టేబుల్), పి. ఆంటోనీ (హెడ్ కానిస్టేబుల్), పి. జనార్దనరావు (డ్రైవర్) గా గుర్తించారు. సమాచారం తెలుసుకున్న ఉన్నతాధికారులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ప్రమాదంపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Next Story