కొడంగల్‌లో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. ఐదుగురు దుర్మరణం

Accident In Kodangal. వికారాబాద్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కొడంగ‌ల్‌ శివారులోని బండల ఎల్లమ్మ

By Medi Samrat
Published on : 19 Jun 2021 9:47 AM IST

కొడంగల్‌లో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. ఐదుగురు దుర్మరణం

వికారాబాద్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కొడంగ‌ల్‌ శివారులోని బండల ఎల్లమ్మ ఆలయం వద్ద శనివారం ఉదయం ఎదురెదురుగా వచ్చిన రెండు కార్లు ఢీకొట్టుకున్నాయి. ఈ ఘటనలో ఐదుగురు వ్య‌క్తులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. హైదరాబాద్‌ నుంచి కర్ణాటక వైపు వెళ్తున్న కారును ఎదురుగా వచ్చిన కారు ఢీకొట్టడంతో ఈ ప్ర‌మాదం సంభ‌వించింది. ప్రమాదంలో రెండు కార్లు నుజ్జునుజ్జయ్యాయి.

ఘ‌ట‌న‌పై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను కారులో నుంచి బయటకు తీశారు. మృతులకు సంబంధించిన వివరాలు తెలియాల్సివుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


Next Story