ఆంధ్రప్రదేశ్లో ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాలు తరచూ జరుగుతుండటం ఆందోళనను కలిగిస్తోంది. ఆదివారం రోజు నంద్యాల జిల్లా నందికొట్టూరు రహదారిపై ఓ టిప్పర్ లారీ బీభత్సం సృష్టించింది. రోడ్డుకు మరో వైపు వెళ్తోన్న బైకును అదుపుతప్పి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. కాగా బాధితులను ఎల్లాగౌడ్, రెహమాన్గా గుర్తించారు.
దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్రేన్ సహాయంతో టిప్పర్ను తొలగించి బాధితులను కర్నూలు సర్వజన వైద్యశాలకు తరలించారు. టిప్పర్ డ్రైవర్ అతిగా మద్యం సేవించడం వల్లే ప్రమాదం జరిగినట్లుగా పోలీసులు నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కాగా ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి.