శ్రీవారి దర్శనానికి వెళ్తూ ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి

ప్రకాశం జిల్లాలో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది.

By Knakam Karthik
Published on : 9 Aug 2025 7:55 AM IST

Crime News, Andrapradesh, Prakasm District, Road Accident, Three Killed

శ్రీవారి దర్శనానికి వెళ్తూ ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి

ప్రకాశం జిల్లాలో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. వ్యాన్‌ను లారీ ఢీకొట్టిన ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. వివరాల్లోకి వెళితే.. పల్నాడు జిల్లా పిడుగురాళ్లకు చెందిన ఓ కుటుంబం మినీ వ్యాన్‌లో తిరుమల శ్రీవారి దర్శనానికి బయల్దేరారు. ఈ క్రమంలోనే చాకిచెర్ల వద్దకు రాగానే వారు ప్రయాణిస్తున్న వ్యాన్‌ను ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు స్పాట్‌లోనే చనిపోయారు. కాగా మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు గాయపడినవారిని మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తరలించారు.

Next Story