ఈత నేర్చుకుందామ‌ని ట్రై చేశాడు.. అంత‌లోనే విషాదం..

9-year-old drowns in farm well in Suryapet. సూర్యాపేట జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. తరుణ్ అనే తొమ్మిదేళ్ల బాలుడు

By Medi Samrat  Published on  21 May 2022 10:52 AM GMT
ఈత నేర్చుకుందామ‌ని ట్రై చేశాడు.. అంత‌లోనే విషాదం..

సూర్యాపేట జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. తరుణ్ అనే తొమ్మిదేళ్ల బాలుడు శనివారం ఉదయం చిల్కూరు మండలం చెన్నారిగూడెంలో ఈత నేర్చుకుంటున్న సమయంలో ప్రమాదవశాత్తు బహిరంగ వ్యవసాయ బావిలో మునిగిపోయాడు. ప్లాస్టిక్ ట్యూబ్‌కు బదులు గాలి నింపిన ప్లాస్టిక్ డబ్బాను తాడుతో నడుముకు కట్టుకుని ఈత నేర్చుకునేందుకు బాలుడు వ్యవసాయ బావిలోకి దిగాడు. ప్లాస్టిక్‌ డబ్బా సరిగా కట్టకపోవడంతో అది వేరు కావడంతో బాలుడు నీటిలో మునిగిపోయాడు.

అతడిని కాపాడేందుకు చుట్టుపక్కల వారు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు నకిరేకల్ వద్ద 65వ నెంబరు జాతీయ రహదారిపై రోడ్డు డివైడర్‌ను బస్సు ఢీకొనడంతో టీఎస్‌ఆర్‌టీసీ బస్సులోని ఎనిమిది మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం 108 అంబులెన్స్‌లో నార్కట్‌పల్లిలోని కామినేని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (కిమ్స్)కి తరలించారు.










Next Story