ఘోర ప్ర‌మాదం.. బ‌స్సులో మంట‌లు.. 8 మంది స‌జీవ‌దహ‌నం.. మృతులంతా హైద‌రాబాద్ వాసులే

8 Charred to death as bus catches fire in Kalaburagi.క‌ర్ణాట‌క రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. ప్రైవేటు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  3 Jun 2022 6:27 AM GMT
ఘోర ప్ర‌మాదం.. బ‌స్సులో మంట‌లు.. 8 మంది స‌జీవ‌దహ‌నం.. మృతులంతా హైద‌రాబాద్ వాసులే

క‌ర్ణాట‌క రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. ప్రైవేటు ట్రావెల్స్ బ‌స్సు.. లారీని ఢీ కొట్టింది. అనంత‌రం అదుపు త‌ప్పి బోల్తా ప‌డింది. దీంతో బ‌స్సులో మంట‌లు చెల‌రేగాయి. క్ష‌ణాల్లో మంట‌లు బ‌స్సు మొత్తం వ్యాపించాయి. ఈ ఘ‌ట‌న‌లో 8 మంది ప్ర‌యాణీకులు స‌జీవ‌దహ‌నం అయ్యారు. ఈ ఘ‌ట‌న క‌ల‌బురిగి జిల్లా క‌మ‌లాపురంలో చోటు చేసుకుంది.

స్పందించిన స్థానికులు 12 మందిని ర‌క్షించి ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. స‌మాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాప‌క సిబ్బంది వెంట‌నే ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. మృత‌దేహాల‌ను స్వాధీనం చేసుకుని, క్ష‌త‌గాత్రుల‌ను చికిత్స నిమిత్తం స‌మీప ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. వీరిలో కొంద‌రి ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ట్లు వైద్యులు తెలిపారు. దీంతో మృతుల సంఖ్య పెరిగే అవ‌కాశం ఉంది. కాగా.. ప్ర‌మాద స‌మ‌యంలో బ‌స్సులో 35 మంది వ‌ర‌కు ఉన్న‌ట్లు తెలుస్తోంది. బ‌స్సు గోవా నుంచి హైద‌రాబాద్‌కు వ‌స్తుండ‌గా ఈ ప్ర‌మాదం జ‌రిగిన‌ట్లు పోలీసులు తెలిపారు. మృతులంతా హైద‌రాబాద్ వాసులుగా తెలుస్తోంది.

Next Story