Hyderabad : హనీ ట్రాప్ చేసి వృద్ధుడి నుంచి రూ. 38 లక్షలు కాజేశారు..!

హైదరాబాద్‌ నగరానికి చెందిన రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగిని హనీ ట్రాప్ చేసి రూ.38.73 లక్షలను సైబర్‌ నేరగాళ్లు కాజేశారు.

By Medi Samrat
Published on : 18 Jun 2025 6:11 PM IST

Hyderabad : హనీ ట్రాప్ చేసి వృద్ధుడి నుంచి రూ. 38 లక్షలు కాజేశారు..!

హైదరాబాద్‌ నగరానికి చెందిన రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగిని హనీ ట్రాప్ చేసి రూ.38.73 లక్షలను సైబర్‌ నేరగాళ్లు కాజేశారు. ఫేస్‌ బుక్‌లో వృద్దుడికి మహిళ పేరుతో ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించారు. తండ్రి తమను వదిలేసి వెళ్లిపోయాడని, తల్లి టైలర్ అంటూ సదరు మహిళ పరిచయం చేసుకుంది. చాటింగ్ చేసేందుకు ఇంటర్నెట్‌ సదుపాయం ఏర్పాటు చేయాలని రూ.10 వేలు లాగేశాడు.

అనంతరం మహిళ నుంచి ఫేస్‌ బుక్‌లో స్పందన లేకపోవడంతో ఇంటర్నెట్ ఇచ్చిన కేబుల్ ఆపరేటర్‌తో బాధితుడు చాటింగ్ చేశాడు. సదరు మహిళ జబ్బు పడిందని ఆస్పత్రిలో ఉందని చెప్పడంతో రూ. 10 లక్షలు ఆ వృద్ధుడు పంపించాడు. క్రెడిట్ కార్డు నుంచి మరో 2.65 లక్షలు చెల్లించాడు. ఇక ఆ మహిళ దుబాయ్ వెళ్లిపోయిందని చెప్పిన కేబుల్ ఆపరేటర్ తన తల్లి, సోదరి మీతో మాట్లాడాలనుకుంటున్నారంటూ వృద్ధుడితో చాటింగ్ చేయించారు. కొద్ది రోజుల పాటు తల్లి, సోదరితో వీడియో కాల్స్ చేశాడు ఆ వృద్ధుడు. తన తల్లి, మైనర్ చెల్లితో చాటింగ్ చేశావంటూ పోలీసులకు ఫిర్యాదు చేస్తానంటూ సదరు వ్యక్తి బెదిరించాడు. బాలిక చదువు, తల్లి డ్వాక్రా రుణం చెల్లింపు నిమిత్తం 12.5లక్షలు కూడా చెల్లించాడు. ఈ వ్యవహారం సెటిల్ చేసిన కానిస్టేబుల్, ఎస్సై కి లక్ష సమర్పించుకున్నాడు

కొత్త ఎస్సై వచ్చాడని కేసు అవ్వ కుండా ఉండాలంటే 10లక్షలు ఇవ్వాలని మరో వ్యక్తి డిమాండ్ చేశాడు. దీంతో సదరు వృద్ధుడు మరో ఏడు లక్షల పంపించారు. ఇలా మొత్తం 38.73లక్షలు వృద్ధుడి దగ్గర్నుండి సైబర్ నేరగాళ్లు వసూలు చేశారు. ఇంకా డబ్బులు డిమాండ్ చేస్తూ ఉండడంతో ప్రభుత్వ ఉద్యోగి ఆన్లైన్ ద్వారా హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Next Story