ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు పోలీసులు మృతి, 14 మంది తీవ్ర గాయాలు

3 cops killed, 14 injured in road mishap during poll duty in Odisha. ఒడిశాలోని నబరంగ్‌పూర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పాపడహండి పోలీసు పరిధిలోని సోరిస్‌పదర్‌లో

By అంజి  Published on  19 Feb 2022 4:18 AM GMT
ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు పోలీసులు మృతి, 14 మంది తీవ్ర గాయాలు

ఒడిశాలోని నబరంగ్‌పూర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పాపడహండి పోలీసు పరిధిలోని సోరిస్‌పదర్‌లో వారు ప్రయాణిస్తున్న బస్సు బోల్తా పడడంతో కనీసం ముగ్గురు పోలీసు సిబ్బంది మరణించారు. 14 మంది గాయపడ్డారు. క్షతగాత్రులందరినీ పాపడహండి సీహెచ్‌సీకి, జిల్లా ఆస్పత్రికి తరలించారు. రిపోర్టు ప్రకారం.. 40-45 మంది భద్రతా సిబ్బందితో కూడిన బస్సు పాపడహండి నుండి కొసగుముడకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. డ్రైవర్ బ్రేకులు వేసినప్పటికీ అదుపు చేయలేక పోవడంతో బస్సు మలుపు దగ్గర రోడ్డుపై నుంచి 15 అడుగుల మేర దూసుకెళ్లింది.

స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని స్థానికుల సహాయంతో గాయపడిన ప్రయాణికులను రక్షించారు. అయితే ఆసుపత్రికి తరలించే సమయానికి ముగ్గురు పోలీసులు మృతి చెందారు. మృతి చెందిన పోలీసు సిబ్బందిని రవి బిసోయ్, సిహెచ్ శేషారావు, జగబంధు గౌడగా గుర్తించారు. ఇదిలావుండగా.. భద్రతా సిబ్బందిని కోల్పోయినందుకు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన సంతాపాన్ని వ్యక్తం చేశారు, "నబరంగ్‌పూర్ జిల్లాలోని పాపాహండి సోరిస్‌పదర్ సమీపంలో రోడ్డు పంచాయతీ ఎన్నికల అధికారి హత్యకు గురైనట్లు వినడం నాకు చాలా బాధ కలిగించింది" అని అన్నారు. "గాయపడిన పోలీసు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. ఈ శోక సమయంలో మృతుల కుటుంబానికి భగవంతుడు అనంతమైన సహనం, ధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాను" అని ధర్మేంద్ర ప్రధాన్ ట్వీట్ చేశారు.

Next Story