దేశంలో రోజు రోజుకు అత్యాచార ఘటనలు పెరిగిపోతున్నాయి. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా కామంధులు రెచ్చిపోతున్నారు. తాజాగా అభం శుభం తెలియని ఓ చిన్నారిపై టీచర్ అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని ఉల్హాస్నగర్లో జరిగింది. సమ్మర్ క్యాంప్లో చేరిన రెండున్నర ఏళ్ల బాలికపై 45 ఏళ్ల డ్యాన్స్ టీచర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందిత టీచర్ను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆ మైనర్ బాలిక ఇంటికి తిరిగి వచ్చి నొప్పితో విలవిలలాడుతుండగా ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది.
ఈ సంఘటన గురించి ఆమె తల్లిదండ్రులు తెలుసుకున్న వెంటనే.. వారు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత పోలీసులు అతడిని పట్టుకోవడానికి గాలింపు చర్యలు ప్రారంభించారు. ఉల్హాస్నగర్ డీసీపీ సచిన్ గోర్, విఠల్వాడి పోలీస్ స్టేషన్ సీనియర్ ఆఫీసర్ అనిల్ పద్వాల్ మార్గదర్శకత్వంలో నిందితుడిని అతని ఇంటి నుండి అరెస్టు చేశారు. మరుసటి రోజు నిందితుడిని ఉల్హాస్నగర్ కోర్టు ముందు హాజరుపరిచారు. అక్కడ అతన్ని మూడు రోజుల పోలీసు కస్టడీకి తరలించారు.