77 పేజీల సూసైడ్‌ నోట్‌.. తల్లిని హత్య చేసి.. తాను ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు

25-year-old ends life after killing mother in Delhi's Rohini. ఢిల్లీలోని రోహిణిలో ఓ వ్యక్తి తన తల్లిని హత్య చేసిన తర్వాత.. మెడ కోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

By Medi Samrat  Published on  5 Sep 2022 1:51 PM GMT
77 పేజీల సూసైడ్‌ నోట్‌.. తల్లిని హత్య చేసి.. తాను ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు

ఢిల్లీలోని రోహిణిలో ఓ వ్యక్తి తన తల్లిని హత్య చేసిన తర్వాత.. మెడ కోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. 25 ఏళ్ల యువకుడు తన తల్లిని గురువారం హత్య చేశాడు. అనంతరం మెడ కోసుకుని జీవితాన్ని ముగించుకున్నాడు. రోహిణి ప్రాంతంలో నివసించే 25 ఏళ్ల క్షితిజ్, గురువారం తన తల్లి మిథిలేషిని హత్య చేశాడు. మూడు రోజుల తర్వాత ఆదివారం రోజున గొంతు కోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆ ఇంటి నుంచి దుర్వాసన రావడంతో ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు ఆ ఇంటికి చేరుకున్నారు.

డోర్‌ లాక్‌ చేసి ఉండటంతో బాల్కానీలోని తలుపు ద్వారా ఆ ఇంట్లోకి ప్రవేశించారు. రక్తం మడుగుల్లో పడి మరణించిన క్షితిజ్‌తో పాటు బాత్‌రూమ్‌లో పడి ఉన్న తల్లి మృతదేహం వారికి కనిపించింది. ఆ ఇంట్లో ఉన్న 77 పేజీల సూసైడ్‌ నోట్‌ను గుర్తించారు పోలీసులు. తన తల్లిని గురువారం హత్య చేసి ఆదివారం తాను ఆత్మహత్య చేసుకున్నట్లు అందులో ఉంది. ఫోరెన్సిక్ బృందాన్ని రప్పించి ఆధారాలు, నమూనాలు సేకరించారు. తల్లీ కుమారుల మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


Next Story