23 ఏళ్ల మహిళపై ముగ్గురు సామూహిక అత్యాచారం

23-year-old woman sexually assaulted in Mumbai. దేశ వాణిజ్య రాజధానిలో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. 23 ఏళ్ల యువతిపై సామూహిక

By అంజి  Published on  15 Feb 2022 8:04 AM GMT
23 ఏళ్ల మహిళపై ముగ్గురు సామూహిక అత్యాచారం

దేశ వాణిజ్య రాజధానిలో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. 23 ఏళ్ల యువతిపై సామూహిక అత్యాచారం చేసిన కేసులో మలాడ్ పోలీసులు ఆదివారం ఒక వ్యక్తిని అరెస్టు చేశారు. మరో ఇద్దరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. మలాడ్ లోని నిందితుల్లో ఒకరి నివాసంలో ముగ్గురు వ్యక్తులు తనపై అత్యాచారం చేశారని ఆరోపిస్తూ మహిళ శనివారం పోలీసులను ఆశ్రయించింది. మహిళ ఎస్కార్ట్ సేవ కోసం పని చేస్తుంది. ఆమె సేవలను ముగ్గురు పురుషులలో ఒకరు నియమించుకున్నారు. శుక్రవారం ఆమె అతని ఇంటికి చేరుకోగానే ముగ్గురు నిందితులు అక్కడే ఉండడంతో ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫిర్యాదుదారు, 23 ఏళ్ల మహిళను నిందితులు ఒక రాత్రికి రూ. 10,000 కి అద్దెకు తీసుకున్నారని, అయితే ఒకరికి బదులు ముగ్గురికి సేవ ఇవ్వాలని కోరారు. ఆమె అలా చేసింది కానీ చెల్లింపు సమయానికి వచ్చేసరికి రూ.30వేలకు బదులు రూ.10వేలు ఇచ్చారు. డబ్బులు ఇవ్వకపోవడంతో వెళ్లేందుకు నిరాకరించడంతో ఆ వ్యక్తులు ఆమెను బలవంతంగా ఇంటి నుంచి గెంటేసేందుకు ప్రయత్నించారు. సామూహిక అత్యాచారంపై కేసు నమోదైందని మలాడ్ పోలీసులకు చెందిన సీనియర్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ ధనంజయ్ లిగాడే ధృవీకరించారు కానీ తదుపరి వివరాలను వెల్లడించలేదు.

Next Story