ఘోర పడవ ప్రమాదం.. 23 మంది దుర్మ‌ర‌ణం

23 dead, dozens missing after boat sinks in Bangladesh. బంగ్లాదేశ్‌లో ఆదివారం ఘోర ప‌డ‌వ ప్ర‌మాదం సంభ‌వించింది.

By Medi Samrat  Published on  25 Sep 2022 12:32 PM GMT
ఘోర పడవ ప్రమాదం.. 23 మంది దుర్మ‌ర‌ణం

బంగ్లాదేశ్‌లో ఆదివారం ఘోర ప‌డ‌వ ప్ర‌మాదం సంభ‌వించింది. ప్రయాణీకులతో నిండిన బోటు బోల్తా పడి మునిగిపోవడంతో కనీసం 23 మంది మరణించారు. అనేక మంది తప్పిపోయినట్లు వార్తా సంస్థ రాయిటర్స్ నివేదించింది. గల్లంతైన వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని ప్రమాదం జరిగిన ఉత్తర పంచగఢ్ జిల్లా పాలనాధికారి జహురుల్ ఇస్లాం తెలిపారు. గల్లంతైన వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు.

తప్పిపోయిన వారి సంఖ్య తనకు ఖచ్చితంగా తెలియదని, అయితే 70 మందికి పైగా ప్రయాణికులు బోటులో ఉన్నారని ప్రయాణికులు చెప్పారు. ఇప్పటి వరకు లభ్యమైన మృతదేహాల్లో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారని ఆయన తెలిపారు.

బంగ్లాదేశ్‌లో ప‌డ‌వ‌ ప్రమాదాల్లో ప్రతి సంవత్సరం వందలాది మంది మరణిస్తున్నారు. ఇది లోతట్టు దేశం. విస్తృతమైన లోతట్టు జలమార్గాలను కలిగి ఉంది, అయితే భద్రతా ప్రమాణాలు తక్కువగా ఉన్నాయి. మే నెల‌లో ఇసుకతో నిండిన బల్క్ క్యారియర్‌ను ఢీకొని పద్మ నదిలో మునిగిపోయిన స్పీడ్‌బోట్ ప్ర‌మాదంలో కనీసం 26 మంది మరణించారు.




Next Story