మైనర్ బాలిక‌లు అదృశ్యం.. గోవాలో ఏం జరిగింంటే..?

ఉత్తర గోవాలోని బాంబోలిమ్‌లో పుట్టినరోజు వేడుకలకు హాజరైన ముగ్గురు మైనర్ బాలికలపై లైంగిక వేధింపులు జరిగాయి.

By Medi Samrat
Published on : 12 Jun 2025 9:00 PM IST

మైనర్ బాలిక‌లు అదృశ్యం.. గోవాలో ఏం జరిగింంటే..?

ఉత్తర గోవాలోని బాంబోలిమ్‌లో పుట్టినరోజు వేడుకలకు హాజరైన ముగ్గురు మైనర్ బాలికలపై లైంగిక వేధింపులు జరిగాయి. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తుల అరెస్టు జరిగింది. నిందితులను అల్తాఫ్ మహబూబ్ ముజావర్ (19), ఓం వినయ్ నాయక్ (21) గా గుర్తించారు.

జూన్ 8వ తేదీ రాత్రి బాధితుల కుటుంబాలు అమ్మాయిలు తప్పిపోయినట్లు ఫిర్యాదు చేశాయి. 13, 15 సంవత్సరాల వయస్సు గల ఇద్దరు బాలికలు జూన్ 7వ తేదీ నుండి కనిపించడం లేదు. దాదాపు అదే సమయంలో 11 ఏళ్ల బాలిక అదృశ్యం గురించి మరొక ఫిర్యాదు నమోదైంది. ముగ్గురు బాలికలు కలిసి వెళ్లారని దర్యాప్తులో తేలింది.

ప్రత్యేక బృందం ఏర్పాటు చేసిన తర్వాత, బాధితులు కాలంఘాట్ ప్రాంతంలోని ఒక హోటల్‌లో ఉన్నట్లు గుర్తించారు. పోలీసులు బాలికలను రక్షించి, వారితో పాటు ఉన్న ఇద్దరు పురుషులను అదుపులోకి తీసుకున్నారు. దర్యాప్తులో, బాలికలు పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడానికి తాము అక్కడికి వెళ్లినట్లు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఐపీసీ సెక్షన్లు 137(2), 64(1), 74, 75(1), గోవా బాలల చట్టంలోని సెక్షన్ 8(2), పోక్సో చట్టంలోని సెక్షన్లు 4, 8, మరియు 12 కింద రెండు వేర్వేరు కేసులు నమోదు చేశారు.

Next Story