15 ఏళ్ల బాలికపై.. 9 రోజుల పాటు సామూహిక అత్యాచారం.. 13 మందికి 20 ఏళ్ల జైలు శిక్ష విధించిన కోర్టు

13 Men Get 20 Years In Jail For Ravishment 15-Year-Old girl in Rajasthan. 15 ఏళ్ల బాలికపై తొమ్మిది రోజుల పాటు పదే పదే అత్యాచారం చేసిన 13 మందికి కోటా కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష, మరో ఇద్దరికి నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది.

By అంజి  Published on  19 Dec 2021 2:21 AM GMT
15 ఏళ్ల బాలికపై.. 9 రోజుల పాటు సామూహిక అత్యాచారం.. 13 మందికి 20 ఏళ్ల జైలు శిక్ష విధించిన కోర్టు

ఈ ఏడాది ప్రారంభంలో 15 ఏళ్ల బాలికపై తొమ్మిది రోజుల పాటు పదే పదే అత్యాచారం చేసిన 13 మందికి కోటా కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష, మరో ఇద్దరికి నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది. పోక్సో చట్టం కింద ఏర్పాటైన ప్రత్యేక కోర్టు ఈ తీర్పు వెలువరించింది. అదనపు సెషన్స్ జడ్జి అశోక్ చౌదరి.. బాలికను ఇక్కడ తన ఇంటి నుండి అపహరించి, ఆమెను ఝలావర్‌కు తీసుకెళ్లి అక్కడ అత్యాచారం చేసినందుకు పలువురికి విక్రయించినందుకు ఒక మహిళకు నాలుగేళ్ల కఠిన కారాగార శిక్ష విధించారు. 16 మందికి శిక్ష విధించగా.. నేరంలో ప్రమేయం ఉన్న మరో 12 మందిని కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది.

నలుగురు తక్కువ వయస్సు గల నేరస్థులు ఇప్పటికీ స్థానిక జువైనల్ జస్టిస్ బోర్డులో వేర్వేరుగా ఈ కేసులో విచారణను ఎదుర్కొంటున్నారు. దోషులకు 20 సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ.10 వేలు, నాలుగు సంవత్సరాల శిక్ష పడిన వారికి రూ.7 వేలు జరిమానా విధించారు. రాజస్థాన్ పోలీస్ డిపార్ట్‌మెంట్ ఆఫీసర్ స్కీమ్ కింద విచారణ జరిపిన తర్వాత నేరం జరిగిన తొమ్మిది నెలలలోపు కోర్టు తీర్పును వెలువరించింది.

టీనేజీ బాలికపై సామూహిక అత్యాచారం కేసులో ఎఫ్‌ఐఆర్ ఈ ఏడాది మార్చి 6న సుకేత్ పోలీస్ స్టేషన్‌లో నమోదైంది. ఆమెను కోటాలో బుల్బుల్ అలియాస్ పూజా జైన్ అనే మహిళ తనకు కొనుగోలు చేస్తానని చెప్పి ఇంటి నుండి రప్పించిందని ఆమె ఫిర్యాదు చేసింది. పూజా తనను ఝలావర్‌కు తీసుకెళ్లి అక్కడ తొమ్మిది రోజుల పాటు తనపై అత్యాచారం చేసిన తర్వాత ఒకరి తర్వాత చాలా మందికి అప్పగించిందని బాలిక తన ఫిర్యాదులో పేర్కొంది. కేసు విచారణను పూర్తి చేసిన తర్వాత, కోట పోలీసులు మే 7న కోర్టుకు 1750 పేజీల ఛార్జిషీటును సమర్పించారు. అంతే వేగంతో విచారణను నిర్వహించిన కోర్టు.. శనివారం తన తీర్పును వెలువరించింది. అని ప్రాసిక్యూషన్ న్యాయవాది ప్రేమ్ నారాయణ్ నామ్‌దేవ్ చెప్పారు.

Next Story