పొలిటికల్ కన్సల్టెన్సీ గ్రూప్ ఐ-ప్యాక్ సంస్థకు సంబంధించిన రెండు ప్రదేశాలలో ఈడీ దాడులు, ఆ ప్రదేశాల నుండి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పత్రాలను తీసుకెళ్లడంపై కొనసాగుతున్న వివాదం ఇప్పుడు కలకత్తా హైకోర్టుకు చేరుకుంది. గురువారం కోల్కతాలో ఈ అంశం రాజకీయంగా తీవ్ర కలకలం రేపడంతో, మమతా ఎన్నికల వ్యూహకర్త అయిన ఐ-ప్యాక్, రెండూ విడివిడిగా పిటిషన్లు దాఖలు చేశాయి.
ఐ ప్యాక్ (IPAC) సంస్థ డైరెక్టర్ ప్రతీక్ జైన్ నివాసం సహా ఐ ప్యాక్కు సంబంధిచిన పలు కార్యాలయాల్లో ఈడీ సోదాలు జరుపుతోంది. మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి కోల్కతా సహా పలు ప్రాంతాల్లో కొనసాగుతున్నాయి. అయితే ఓ వైపు ఈడీ సోదాలు జరుగుతున్న సమయంలోనే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఐ ప్యాక్ సంస్థ డైరెక్టర్ ప్రతీక్ జైన్ నివాసానికి వెళ్లారు. గతంలో పలు రాష్ట్రాల్లో ఆయా పార్టీలకు పొలిటికల్ కన్సల్టెన్సీగా సేవలు అందించిన ఐ ప్యాక్ సంస్థ పశ్చిమబెంగాల్లో మమతా బెనర్జీ పార్టీ టీఎంసీకి సైతం సేవలు అందిస్తోంది. ప్రతీక్ జైన్ ప్రస్తుతం తృణమూల్ కాంగ్రెస్ ఐటీ సెల్ అధ్యక్షుడిగా కూడా వ్యవహరిస్తున్నారు.