ఏపీలో లక్ష దాటిన కరోనా‌ కేసులు.. కొత్తగా 6051 కేసులు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  27 July 2020 12:34 PM GMT
ఏపీలో లక్ష దాటిన కరోనా‌ కేసులు.. కొత్తగా 6051 కేసులు

ఏపీలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య లక్షకు చేరింది. గడిచిన 24 గంటల్లో 43,127 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 6,051 పాజిటివ్‌ కేసులు నమోదు అయినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజా బులిటెన్‌లో వెల్లడించింది. వీటితో కలిపి రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,02,349కి చేరింది.

కొవిడ్‌ వల్ల పశ్చిమగోదావరిలో తొమ్మిది మంది, విశాఖపట్నంలో ఎనిమిది మంది, చిత్తూరులో ఏడుగురు, తూర్పుగోదావరిలో ఏడుగురు, కృష్ణలో ఐదుగురు, విజయనగరంలో నలుగురు, అనంతపురంలో ముగ్గురు, కర్నూల్‌లో ఇద్దరు, శ్రీకాకుళంలో ఇద్దరు, కడపలో ఒక్కరు, ప్రకాశంలో ఒక్కరు చొప్పున మొత్తం 49 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో మృతుల సంఖ్య 1090 కి చేరింది. మొత్తం నమోదు అయిన కేసుల్లో ఇప్పటి వరకు 49,558 మంది కోలుకుని డిశ్చార్జి కాగా.. 51,701 మంది చికిత్స పొందుతున్నారు.

కొత్తగా నమోదైన కేసులు.. జిల్లాల వారిగా..

అనంతపురంలో 524,

చిత్తూరులో 367,

ఈస్ట్‌ గోదావరిలో 1210,

గుంటూరులో 744,

కడపలో 336,

కృష్ణలో 127,

కర్నూలులో 664,

నెల్లూరులో 422,

ప్రకాశంలో 317,

శ్రీకాకుంలో 120,

విశాఖపట్నంలో 655,

విజయనగరంలో 157,

పశ్చిమ గోదావరిలో 408 చొప్పున కేసులు నమోదు అయ్యాయి.



Next Story