ఏపీలో కరోనా విజృంభణ.. కొత్తగా 8,147 కేసులు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  24 July 2020 12:22 PM GMT
ఏపీలో కరోనా విజృంభణ.. కొత్తగా 8,147 కేసులు

ఏపీలో కరోనా మహమ్మారి ఉద్దృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 48,114 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 8,147 పాజిటివ్‌ కేసులు నమోదు అయినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజా బులిటెన్‌లో వెల్లడించింది. వీటితో కలిపి రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 80858కి చేరింది.

కొవిడ్‌ వల్ల తూర్పుగోదావరిలో పదకొండు మంది, కృష్ణలో తొమ్మిది మంది, కర్నూల్‌లో ఎనిమిది మంది, శ్రీకాకుళంలో ఏడుగురు, పశ్చిమగోదావరిలో ఐదుగురు, గుంటూరులో ముగ్గురు, విశాఖపట్నంలో ఏడుగురు, పశ్చిమగోదావరిలో ఐదుగురు, గుంటూరులో ముగ్గురు, విశాఖపట్నంలో ముగ్గురు, చిత్తూరులో ఒక్కరు, ప్రకాశంలో ఒక్కరు, విజయనగరంలో ఒక్కరు చొప్పున మొత్తం 49 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో మృతుల సంఖ్య 933 కి చేరింది. మొత్తం నమోదు అయిన కేసుల్లో ఇప్పటి వరకు 39,935 మంది కోలుకుని డిశ్చార్జి కాగా.. 39,990మంది చికిత్స పొందుతున్నారు.

కొత్తగా నమోదైన కేసులు.. జిల్లాల వారిగా..

అనంతపురంలో 984,

చిత్తూరులో 630,

ఈస్ట్‌ గోదావరిలో 1029,

గుంటూరులో 703,

కడపలో 494,

కృష్ణలో 359,

కర్నూలులో 914,

నెల్లూరులో 278,

ప్రకాశంలో 355

శ్రీకాకుంలో 374,

విశాఖపట్నంలో 898,

విజయనగరంలో 322,

పశ్చిమ గోదావరిలో 807 చొప్పున కేసులు నమోదు అయ్యాయి.



Next Story