గ్యాంగ్‌స్టర్‌ నయీం కేసులో మరో సంచలనం.. 25 మంది పోలీసులకు క్లీన్‌చిట్‌

By సుభాష్  Published on  3 Oct 2020 10:40 AM GMT
గ్యాంగ్‌స్టర్‌ నయీం కేసులో మరో సంచలనం.. 25 మంది పోలీసులకు క్లీన్‌చిట్‌

తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన గ్యాంగ్‌స్టర్‌ నయీం కేసులో మరో సంచలనం చోటు చేసుకుంది. నయీం ఎన్‌కౌంటర్‌ తర్వాత ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న 25 మంది పోలీసులకు క్లీన్‌చిట్‌ ఇచ్చింది. నయీంతో సంబంధాలున్నాయని భూ సెటిల్‌మెంట్‌, బెదిరింపు ఆరోపణలు ఎదుర్కొన్న 25 మంది పోలీసు అధికారులకు ఈ కేసులో ఎలాంటి సంబంధం లేదని తేల్చింది. అధికారులపై వచ్చిన ఆరోపణల్లో ఎలాంటి ఆధారాలు లభించని కారణంగా వారందరి పేర్లను తొలగిస్తున్నట్లు పేర్కొంది. ఈ మేరకు పోలీసు అధికారుల పాత్రపై ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ రాసిన లేఖకు సిట్‌ చీఫ్‌ నాగిరెడ్డి శనివారం సమాధానం ఇచ్చారు. కాగా, ఈ కేసులో సిట్‌ 175కుపైగా చార్జ్‌షీట్‌లను దాఖలు చేసిన విషయం తెలిసిందే. 130పైగా కేసుల్లో పోలీసులతో పాటు 8 మంది ప్రముఖ నాయకీయ నాయకుల పేర్లు కూడా ఉన్నాయి. ఇందులో ఇద్దరు అడిషనల్‌ ఎస్సీలతోపాటు మరో ఏగుడురు డీఎస్పీలు, 13 మంది సీఐలు, హెడ్‌కానిస్టేబుళ్లు ఉన్నారు.

క్లీన్‌చిట్‌ పొందిన వారు..

అడిషనల్‌ ఎస్పీలు

శ్రీనివాస్‌, చంద్రశేఖర్‌

డీఎస్పీలు:

సిహెచ్‌. శ్రీనివాస్‌, ఎం. శ్రీనివాస్‌, మనోహర్, ప్రకాశ్‌, సాయి, ప్రకాశ్‌ రావు, తిరుపతన్న, అమరేందర్‌రెడ్డి, వెంకట నరసయ్య

ఎస్సైలు :

ఎస్‌.శ్రీనివాస్‌ కిషన్‌, వెంకటయ్య, రాజగోపాల్‌, మస్తాన్‌, వెంకట్‌రెడ్డి, వెంకట సూర్య ప్రకాశ్‌, రవి కిరణ్ రెడ్డి, బలవంతయ్య, నరేందర్‌ గౌడ్‌, రవీందర్‌ మజీద్‌.

కానిస్టేబుళ్లు :

బాలన్న, ఆనంద్‌ సదాత్‌మియా

Next Story