ఆ 17మంది గిరిపుత్రుల‌ను బ‌లి తీసుకుంది పోలీసులే..!

By Newsmeter.Network  Published on  4 Dec 2019 10:10 AM GMT
ఆ 17మంది గిరిపుత్రుల‌ను బ‌లి తీసుకుంది పోలీసులే..!

మావోయిస్టులను నియంత్రించే కార్యక్రమలో భాగంగా పోలీసులు 17 మందిని కాల్చివేసిన‌ దుర్ఘటన 2012 జూన్ 28 న చత్తీసుగఢ్ లోని సర్కేగూడ ప్రాంతంలో జరిగింది. ఈ దుర్ఘటన పై ఆ సమయంలో పెను దుమారం రేగింది. అయితే అప్పటి ప్రభుత్వం ఈ విషయం పై విచారణకు కమిటీని నియమించినది. విచారణలో అసలు విషయాలు బయటపడ్డయి. అయితే ఎన్‌కౌంట‌ర్‌ లో చనిపోయింది అమాయక గిరిజనులని తేలింది.

17 New

జస్టిస్ విజయకుమార్ ఆద్వర్యంలోని జ్యూడిషియల్ కమిటీ నివేదిక.. సర్కేగూడ గ్రామస్తులు బీజ్ పందుమ్ పండుగ గురుంచి మాట్లాడుకోవడం కోసం ఆ నాటి రాత్రి సమావేశం అయినట్లు తెలిపారు. ఈ క్రమంలో అక్కడ సమావేశం అయినది మావోయిస్టులుగా భావించి వారి పై కాల్పులు జరిపారని నివేదికలో సూచించారు. ఈ విషయంలో అప్పటి పోలీసులు.. గ్రామస్తులే మొదట మాపై కాల్పులు జరిపారని.. అందువల్లనే మేము కాల్పులు జరిపామని తెలిపారు.

అయితే గ్రామస్తుల దగ్గర ఎటువంటి ఆయుధాలు గాని వాటికీ సంబందించి ఎటువంటి ఆధారాలు లేనట్లు కమిటీ తెలిపింది. ఈ విషయంగా ఎన్‌కౌంట‌ర్‌ సమయంలో అక్కడే ఉన్న డిఐజి ఎలాంగో ని కమిటీ విచారించగా.. సమావేశం జ‌రిగిన ప్రాంతం నుండి ఎలాంటి కాల్పులు రాలేదని తెలిపారు. ముందుగా పోలీసులే కాల్పులు జరిపారని చెప్పారు. ఈ విషయంలో పోలీసులు వారికీ అందిన సమాచారం బట్టి పొరపాటున కాల్పులు జరిపినట్లుగా కమిటీ విచారణలో తెలిపింది.

జస్టిస్ అగర్వాల్ కమిటీ నివేదికను శనివారం రాత్రి క్యాబినెట్ సమావేశం లో ఉంచడం జరిగింది. ఈ విషయంగా ప్రభుత్వ, ప్రతిపక్ష పార్టీలు విమర్శించుకోవడం మొదలుపెట్టారు. అదేవిధంగా బాధితుల తరుపున వాదిస్తున్న న్యాయవాది ఈషా ఖండేల్వాల్ ఈ నివేదికను సోష‌ల్ మీడియా మాధ్య‌మాల‌లో చూసాను అని చెప్పారు.

Next Story