రైల్వే ప్రయాణీకులకు ముఖ్యగమనిక.. ఏపీ, తెలంగాణ మధ్య నడిచే 27 రైళ్లు రద్దు
South central Railway cancelled 27 trains.కరోనా మహమ్మారి రైల్వే శాఖ పై తీవ్ర ప్రభావం చూపుతోంది. కరోనా కట్టడికి
By తోట వంశీ కుమార్ Published on
31 May 2021 7:16 AM GMT

కరోనా మహమ్మారి రైల్వే శాఖ పై తీవ్ర ప్రభావం చూపుతోంది. కరోనా కట్టడికి పలు రాష్ట్రాల్లో లాక్డౌన్, కర్ఫ్యూను అమలు చేస్తున్నాయి. ప్రజలు తమ ప్రయాణాలను వాయిదా వేసుకుంటున్నారు. రైళ్లలో ఎక్కవారి సంఖ్య పూర్తిగా తగ్గిపోతోంది. దీంతో చాలా రైళ్లు ఖాళీగా కనిపిస్తున్నాయి. ప్రయాణీకులు లేకపోవడంతో ఆక్యుపెన్సీ భారీగా తగ్గిపోతుంది. ఈ క్రమంలోనే దక్షిణ మధ్య రైల్వే తెలుగు రాష్ట్రాల మధ్య నడిచే అనేక రైళ్లను రద్దుచేసింది.
ఏపీ, తెలంగాణ మధ్య ప్రయాణించే మరో 27 రైళ్లను రద్దు చేస్తున్నట్లు ఆదివారం దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఏపీ, తెలంగాణ మధ్య రాకపోకలు సాగించే పలు రైళ్లతో పాటు తమిళనాడు, మహారాష్ట్రకు వెళ్లే రైళ్లను కూడా రద్దు చేసింది. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే పరిధిలో రద్దు చేసిన రైళ్ల జాబితాను అధికారులు ప్రకటించారు.
రద్దు చేసిన రైళ్ల వివరాలు ఇవే..
Next Story