ముచ్చటపడ్డారు.. రూ. 592 కోట్లు పెట్టి కొనుగోలు చేసేసిన ముకేశ్ అంబానీ

Reliance Industries Buys Another British Icon. బ్రిటన్‌లోని రెండోతరం రాజకుటుంబానికి చెందిన తొలి కంట్రీక్లబ్ 'స్టోక్ పార్క్'ను ముకేశ్ అంబానీ

By Medi Samrat  Published on  23 April 2021 2:45 PM GMT
ముచ్చటపడ్డారు.. రూ. 592 కోట్లు పెట్టి కొనుగోలు చేసేసిన ముకేశ్ అంబానీ

బ్రిటన్‌లోని రెండోతరం రాజకుటుంబానికి చెందిన తొలి కంట్రీక్లబ్ 'స్టోక్ పార్క్'ను ముకేశ్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ సొంతం చేసుకుంది. ఇంటర్నేషనల్ గ్రూప్ (ఐజీ)కి చెందిన ప్రతిష్ఠాత్మక కంట్రీక్లబ్, లగ్జరీ గోల్ఫ్ రిసార్ట్ అయిన 'స్టోక్‌పార్క్'ను 57 మిలియన్ పౌండ్ల (దాదాపు రూ. 592 కోట్లు) కు కొనుగోలు చేసింది. రిలయన్స్ ఇండస్ట్రియల్ ఇన్వెస్టిమెంట్ అండ్ హోల్డింగ్స్ లిమిటెడ్ (ఆర్ఐఐహెచ్ఎల్) ఒప్పందంపై సంతకం చేసింది. వచ్చే నాలుగేళ్లలో మొత్తం 3.3 బిలియన్ల పెట్టుబడులు పెట్టనున్నట్టు రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రకటించింది. రిటైల్ రంగంలో 14 శాతం, టెక్నాలజీ, మీడియా, టెలికం (టీఎంటీ) రంగంలో 80 శాతం, ఎనర్జీ రంగంలో ఆరు శాతం పెట్టుబడులు పెట్టనున్నట్టు తెలిపింది.

స్టోక్ పార్క్ బకింగ్ హాంషైర్ లో హోటల్, క్రీడలు, థీమ్ పార్క్ లను నిర్వహిస్తోంది. జేమ్స్ బాండ్ సినిమాల్లోని రెండు సీక్వెన్స్ లకు సంబంధించిన సన్నివేశాలను స్టోక్ పార్క్ లోనే తీశారు. 1964 నాటి 'గోల్డ్ ఫింగర్' సినిమాతో స్టోక్ పార్క్ లోని గోల్ఫ్ కోర్స్ చాలా ప్రసిద్ధి చెందింది. స్టోక్ పార్క్ ను 1908 దాకా దానిని ప్రైవేట్ నివాసంగా వాడేవారట. దాదాపు 300 ఎకరాల్లో స్టోక్ పార్క్ విస్తరించి ఉంది. మధ్యలో తెల్లటి ఓ పెద్ద సౌధం, 49 విలాసవంతమైన పడక గదులు, 27 స్లాట్స్ ఉన్న గోల్ఫ్ కోర్స్ లు, 13 టెన్నిస్ కోర్టులు, 14 ఎకరాల ప్రైవేట్ గార్డెన్ ల వంటి వాటితో స్టోక్ పార్క్ పర్యాటకులను ఆకర్షిస్తోంది. ముఖేశ్ అంబానీ దంపతులూ అప్పుడప్పుడు అక్కడకు వెళ్లి ముచ్చటపడ్డారని అంటున్నారు. గురువారం నాడు కొనుగోలుకు సంబంధించి ఎక్స్ చేంజ్ ఫైలింగ్ దాఖలు చేశారు.


Next Story