ఐటీ రిటర్న్స్ ఫైల్స్ విషయంలో ఆదాయపు పన్ను శాఖ కీలక నిర్ణయం
ఇన్కం ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్స్ విషయంలో ఆదాయపు పన్ను శాఖ కీలక నిర్ణయం తీసుకుంది
By Knakam Karthik
ఐటీ రిటర్న్స్ ఫైల్స్ విషయంలో ఆదాయపు పన్ను శాఖ కీలక నిర్ణయం
ఇన్కం ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్స్ విషయంలో ఆదాయపు పన్ను శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పన్ను రిటర్నుల దాఖలు గడువును పొడిగించింది. 2025 జులై 31తో గడువు ముగియనుండగా.. సెప్టెంబర్ 15 వరకు పన్ను చెల్లింపుదారులకు అవకాశం కల్పించింది. ఐటీఆర్ ఫారాల నోటిఫికేషన్ జారీ ఆలస్యం నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ విషయంపై ఆదాయపు పన్ను శాఖ తన అధికారిక ఎక్స్ ఖాతాలో ఒక ప్రకటన విడుదల చేసింది.
"2025-26 మదింపు సంవత్సరానికి నోటిఫై చేసిన ఐటీఆర్ ఫారాల్లో చేపట్టిన మార్పులకు అనుగుణంగా సిస్టమ్ను సిద్ధం చేయడానికి కొంత సమయం అవసరం. పన్ను చెల్లింపుదారులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సులభంగా రిటర్నులు ఫైల్ చేసేందుకు వీలుగా, జులై 31తో ముగియనున్న గడువును సెప్టెంబర్ 15 వరకు పొడిగిస్తున్నాం" అని ఆ ప్రకటనలో ఆదాయపు పన్ను శాఖ స్పష్టం చేసింది.
Kind Attention Taxpayers!CBDT has decided to extend the due date of filing of ITRs, which are due for filing by 31st July 2025, to 15th September 2025This extension will provide more time due to significant revisions in ITR forms, system development needs, and TDS credit… pic.twitter.com/MggvjvEiOP
— Income Tax India (@IncomeTaxIndia) May 27, 2025