ఇన్‌స్టాగ్రామ్‌ యూజర్లకు గుడ్‌న్యూస్ చెప్పిన ఫేస్‌బుక్‌.!

Instagram new features 2021. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది ఇన్‌స్టాగ్రామ్‌ యూజర్లకు ఫేసుబుక్‌ గుడ్‌ న్యూస్‌ చెప్పింది. ఇకపై పర్సనల్‌

By అంజి  Published on  21 Oct 2021 12:04 PM GMT
ఇన్‌స్టాగ్రామ్‌ యూజర్లకు గుడ్‌న్యూస్ చెప్పిన ఫేస్‌బుక్‌.!

ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది ఇన్‌స్టాగ్రామ్‌ యూజర్లకు ఫేసుబుక్‌ గుడ్‌ న్యూస్‌ చెప్పింది. ఇకపై పర్సనల్‌ కంప్యూటర్‌లలో కూడా ఇన్‌స్టాగ్రామ్‌ యాప్‌ను వాడుకునే అవకాశాన్ని కల్పించింది. ఫొటోలు, వీడియోలను వెబ్‌ వెర్షన్‌ ద్వారా పోస్ట్‌ చేసే వెసులుబాటును తీసుకొచ్చింది. మొదట్లో 'ఎన్‌గాడ్జెట్‌'లో ఈ ఫీచర్ కనిపించేంది. అయితే ప్రస్తుతం ఈ ఫీచర్‌ ప్రపంచంలోని యూజర్లకు అందరికీ అందుబాటులోకి వచ్చింది. ఈ కొత్త ఫీచర్ ద్వారా పీసీలలో ఎడిట్‌ చేసుకున్న ఇమేజ్‌లను, ప్రాసెస్డ్‌ ఫొటోలను అప్‌లోడ్‌ చేసుకోవచ్చు.

ఇదివరకైతే పీసీల నుంచి మొబైల్‌ ఫోన్‌లకు పంపించుకున్నాకే ఫొటోలను అప్‌లోడ్‌ చేసుకునే అవకాశం ఉండేదని అందరికి తెలిసిన విషయమే. అయితే ఈ ప్రాసెస్‌ కొంచెం కష్టంగా ఉండడంతో.. కొత్త ఫీచర్‌ను ఇన్‌స్టా అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటి వరకు ఫోన్‌ యాప్‌గా ఇన్‌స్టాగ్రామ్‌ ఉండేది. ఈ కొత్త ఫీచర్‌తో రావడంతో కంప్యూటర్‌లు వాడేవారికి ఇన్‌స్టా మరింత సులభం కానుంది. దీంతో యూజర్ల సంఖ్య మరింత పెరగొచ్చని ఫేస్‌బుక్‌ భావిస్తోంది.

Next Story