ఉద్యోగులకు గుడ్న్యూస్.. పెరగనున్న జీతాలు
వచ్చే ఏడాది భారత కంపెనీలు ఉద్యోగులకు సగటున 9.8 శాతం జీతాలను పెంచే అవకావం ఉందని డబ్ల్యూటీడబ్ల్యూ శాలరీ బడ్జెట్ ప్లానింగ్ రిపోర్టు తెలిపింది.
By అంజి Published on 2 Nov 2023 12:34 PM IST
ఉద్యోగులకు గుడ్న్యూస్.. పెరగనున్న జీతాలు
ఆసియా పసిఫిక్ రీజియన్లోనే అత్యధికంగా వచ్చే ఏడాది భారత కంపెనీలు ఉద్యోగులకు సగటున 9.8 శాతం జీతాలను పెంచే అవకావం ఉందని డబ్ల్యూటీడబ్ల్యూ శాలరీ బడ్జెట్ ప్లానింగ్ రిపోర్టు తెలిపింది. వచ్చే సంవత్సరం ఆసియా పసిఫిక్ రీజియన్లో అధికంగా జీతాల పెంపు ఒక్క భారత్లోనే జరగబోతోందని రిపోర్ట్ వెల్లడించింది. లేబర్ మార్కెట్లో డిమాండ్, ద్రవ్యోల్బణం పెరుగుదల కారణంగా కంపెనీలు శాలరీ బడ్జెట్ను పెంచుకుంటాయని పేర్కొంది. అయితే 2022తో పోలిస్తే, సగానికి పైగా కంపెనీలు ఈ ఏడాది తమ జీతాల బడ్జెట్లను పెంచాయి. అయితే 2022 డిసెంబర్లో చేసిన అంచనాల కంటే నాలుగింట ఒక వంతు తమ బడ్జెట్లను పెంచినట్లు సర్వేలో తేలింది.
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇంజనీరింగ్, సేల్స్, టెక్నికల్ స్కిల్స్ ట్రేడ్, టెక్నాలజీ, మీడియా, గేమింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, రిటైల్, హ్యూమన్ రీసోర్స్ విభాగాల్లో 10 శాతం పెంపు ఉండొచ్చని తెలిపింది. ప్రపంచ ఆర్థిక మందగమనం ఉన్నప్పటికీ 2024లో ఆసియా పసిఫిక్ ప్రాంతంలో భారతీయ కంపెనీలు అత్యంత గణనీయమైన జీతాల పెంపుదలను అందించడానికి సిద్ధంగా ఉన్నాయనే సమాచారం. భారత్ సంస్థలు టెక్నాలజీ వైపు అడుగులు వేస్తున్నాయి. దీంతో ఉద్యోగుల ప్రతిభకు తీవ్రమైన పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలోనే జీతాల పెరుగుదల జరగనుంది.
రెండవది, గణనీయమైన సంఖ్యలో భారతీయ సంస్థలు సాంకేతికత , ఇతర వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగాలలో పనిచేస్తున్నాయి, ఇవి మరింత గణనీయమైన పరిహారం ప్యాకేజీలను అందిస్తాయి. చివరగా, భారత ప్రభుత్వం వ్యాపార వృద్ధిని మరియు ఉద్యోగ కల్పనను పెంపొందించడానికి, ఆర్థిక పురోగతికి, వేతన వృద్ధికి అనుకూలమైన నేపథ్యానికి దోహదపడే చర్యలను అమలు చేసింది.ఉద్యోగుల జీతాల విషయంలో.. భారత్ తర్వాత అధికంగా జీతాలను వియత్నం 8 శాతం, చైనా 6 శాతం, ఫిలిప్పీన్స్ 5.7 శాతం, థాయిలాండ్ 5 శాతం వరకు పెంచనుంది.