గుడ్‌న్యూస్‌.. పెట్రోల్‌, డీజిల్‌ భారీగా తగ్గింపు.. నేటి నుంచే అమల్లోకి

కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను రెండు రూపాయలు తగ్గించింది. కొత్త ధరలు మార్చి 15 ఉదయం 6 గంటల నుంచి అమల్లోకి వస్తాయని తెలిపింది.

By అంజి  Published on  15 March 2024 12:57 AM GMT
motorists, Petrol, diesel, prices, Nationalnews

గుడ్‌న్యూస్‌.. పెట్రోల్‌, డీజిల్‌ భారీగా తగ్గింపు.. నేటి నుంచే అమల్లోకి

కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను రెండు రూపాయలు తగ్గించింది. కొత్త ధరలు మార్చి 15 ఉదయం 6 గంటల నుంచి అమల్లోకి వస్తాయని పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ తెలిపింది.

పెట్రోల్ ధరల సవరణ తర్వాత, ప్రధాన నగరాల్లో ఇవి కొత్త రేట్లు:

ఢిల్లీలో ధర రూ.96.72 నుంచి రూ.94.72కి తగ్గనుంది

ముంబైలో ఈ ధరలు రూ.106.31 నుంచి రూ.104.21కి చేరుతాయి

కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ.106.3 నుంచి 103.94కి తగ్గనుంది

చెన్నైలో పెట్రోల్ ధర రూ.102.63 నుంచి 100.75కి తగ్గనుంది

కొత్త డీజిల్ ధరలు ఇవే:

ఢిల్లీలో డీజిల్ ధర రూ.89.62 నుంచి రూ.87.62కి తగ్గనుంది.

ముంబైలో డీజిల్ ధర రూ.94.27 నుంచి రూ.92.15కి తగ్గనుంది.

కోల్‌కతాలో డీజిల్ ధర రూ.92.76 నుంచి 90.76కి తగ్గనుంది

చెన్నైలో డీజిల్ ధర రూ.94.24 నుంచి 92.34కి తగ్గనుంది

పెట్రోలు, డీజిల్ ధరల తగ్గింపు వినియోగదారుల వ్యయాన్ని పెంచుతుందని పెట్రోలియం మంత్రిత్వ శాఖ పేర్కొంది. డీజిల్‌తో నడిచే 58 లక్షలకు పైగా భారీ వస్తువుల వాహనాలు, 6 కోట్ల కార్లు, 27 కోట్ల ద్విచక్ర వాహనాల నిర్వహణ ఖర్చులు కూడా తగ్గుతాయని మంత్రిత్వ శాఖ తెలిపింది.

వచ్చే లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో పెట్రోల్‌, డీజిల్‌ ధర తగ్గింపు.

పెట్రోలు, డీజిల్ ధరలను తగ్గించినందుకు ప్రధాని నరేంద్ర మోదీని పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి ప్రశంసించారు. ఇతర దేశాలతో పోలిస్తే భారతదేశంలో ఇంధన ధరలు చాలా తక్కువగా ఉన్నాయని అన్నారు. భారతదేశంలో ఇంధన ధరలను ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీ, స్పెయిన్‌లలో 50 నుండి 79 శాతం ఎక్కువగా ఉన్న ధరలతో పోల్చారు.

ప్రపంచ వ్యాప్తంగా ఇంధన ధరలు పెరుగుతున్నప్పటికీ దేశంలో మోదీ ప్రభుత్వం ఈ మధ్యకాలంలో పెట్రోల్‌, డీజిల్ ధరలు పెంచడం లేదా తగ్గించడం చేయలేదని కేంద్రమంత్రి హర్దీప్‌ సింగ్‌ పూరి అన్నారు. 2022 నవంబర్‌ నుంచి ఇప్పటి వరకు కేంద్రం పెట్రోల్‌పై రూ.15, డీజిల్‌పై రూ.17 తగ్గించిందని తెలిపారు. భారత్‌లో సగటు పెట్రోల్‌, డీజిల్ ధరలు వరుసగా రూ.94, రూ.87గా ఉంటే ఇతర దేశాల్లో 50 శాతానికిపైగా అదనంగా ఉన్నాయని ట్వీట్ చేశారు.

Next Story