బీహార్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..11 మంది మృతి

By సుభాష్  Published on  7 March 2020 5:59 AM GMT
బీహార్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..11 మంది మృతి

బీహార్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. శనివారం ఉదయం ముజఫర్‌పూర్‌ జిల్లా కంటి పోలిస్‌స్టేషన్‌లోని జాతీయ రహదారిపై జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో 11 మంది అక్కడికక్కడే మృతి చెందగా, మరి కొందరు తీవ్రం గాయపడ్డారు. ఓ స్కార్పియో వాహనం ట్రాక్టర్‌ ఒకదానికొకటి ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story