ఏపీ పాలిసెట్‌-2020 ఫలితాలు విడుదల

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  9 Oct 2020 8:47 AM GMT
ఏపీ పాలిసెట్‌-2020 ఫలితాలు విడుదల

ఏపీ పాలీసెట్‌-2020 ప్రవేశ పరీక్ష ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. సాంకేతిక విద్య కమీషనర్ కార్యాలయంలోఆంధ్రప్రదేశ్‌ నైపుణ్యాభివృద్ధి మరియు శిక్షణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనంత రాము, సాంకేతిక విద్యాశాఖ కమీషనర్ ఎంఎం నాయక్‌ పాలీసెట్‌ ఫలితాలను విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఏపీ పాలీసెట్‌ 2020లో 84 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని స్కిల్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ ట్రైనింగ్‌ సీఎస్‌ అనంతరాము తెలిపారు.

పాలీసెట్ పరీక్షకు 88,372 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా.. 71,631 మంది పరీక్ష రాశారని అన్నారు. పరీక్ష రాసిన వారిలో 84శాతంతో 60,780 మంది ఉత్తీర్ణత సాధించారని వెల్లడించారు. బాలురు 50,706 మంది పరీక్షలు రాయగా 42,313 మంది ఉత్తీర్ణత సాధించారు. బాలికలు 20,925 మంది పరీక్షలు రాయగా 18,467 మంది ఉత్తీర్ణత సాధించారు.

పశ్చిమ గోదావరికి చెందిన మట్టా దుర్గా సాయి కీర్తి తేజ 120 మార్కులతో స్టేట్ టాప్‌ర్‌గా నిలిచారన్నారు. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన సుంకర అక్షయ ప్రణీత్ 119 మార్కులతో రెండవ ర్యాంకు, తూర్పు గోదావరి జిల్లాకు చెందిన సవిలత శ్రీదత్త శ్యామ సుందర్ 118 మార్కులతో మూడవ ర్యాంకును దక్కించుకున్నారని వెల్లడించారు. 2020-21 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటుకు సంబంధించి 271 కళాశాలల్లో 66,742 సీట్లు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.

Next Story