ఏపీలో కొత్త జిల్లాల‌ ఏర్పాటుకు ముందడుగు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  7 Aug 2020 1:14 PM GMT
ఏపీలో కొత్త జిల్లాల‌ ఏర్పాటుకు ముందడుగు

ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు విష‌య‌మై మరో అడుగుపడింది. రాష్ట్రంలో 25 జిల్లాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఇటీవల కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. దీంతో కొత్త‌ జిల్లాల ఏర్పాటుకు అధ్యయన కమిటీ ఏర్పాటైంది. ఈమేరకు అధ్యయన కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. ఇటీవల ఏపీ కేబినెట్‌లో తీసుకున్న నిర్ణయం మేరకు జిల్లాల పునర్వవస్థీకరణ అధ్యయన కమిటీ ఏర్పాటు చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చైర్మన్‌గా ఆరుగురు ఉన్నతాధికారులతో కమిటీని నియమించారు.

సీఎస్‌ నీలం సాహ్ని ఈ కమిటీకి అధ్యక్షత వహిస్తారు. 25 జిల్లాల ఏర్పాటుపై కమిటీ అధ్యయనం చేస్తుంది. ఆరుశాఖల అధికారులు సీసీఎల్‌ఏ కమిషనర్‌, జీఏడీ సర్వీసెస్ కార్యదర్శి.. ప్రణాళికా శాఖ కార్యదర్శి, సీఎంవో అధికారి, కమిటీ కన్వీనర్‌గా ప్రిన్సిపల్ ఫైనాన్స్ సెక్రటరీ ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. మూడు నెలల్లోపు నివేదిక ఇవ్వాలని కమిటీకి గడువు విధిస్తూ ఉత్తర్వులు జారీచేశారు.

Ap

Next Story