ఏపీలో 998 కరోనా పాజిటివ్‌ కేసులు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  5 July 2020 8:56 AM GMT
ఏపీలో 998 కరోనా పాజిటివ్‌ కేసులు

ఏపీలో కరోనా విలయతాండవం కొనసాగుతోంది. నిత్యం వందల సంఖ్యలో పాజిటివ్‌ కేసులు నమోదు అవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 20,567 సాంపిల్స్‌ని పరీక్షించగా.. కొత్తగా 998 మందికి పాజిటివ్‌గా నిర్థారణ అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తాజా బులిటెన్‌లో తెలిపింది. వీటిలో రాష్ట్రానికి చెందిన వారు 961 మంది కాగా.. పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 36 మంది.. విదేశాల నుంచి వచ్చినవారు ఒక్కరు ఉన్నారు. వీటితో కలిపి ఇప్పటి వరకు రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 18697కి చేరింది.

ఈ రోజు కొవిడ్‌ వల్ల కర్నూలులో ఐదుగురు, అనంతపూర్‌లో ముగ్గురు, చిత్తూరులో ఇద్దరు, కడపలో ఇద్దరు, కృష్ణలో ఒక్కరు, విశాఖపట్నంలో ఒక్కరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో మృతుల సంఖ్య 232కి చేరింది. మొత్తం నమోదు అయిన కేసుల్లో ఇప్పటి వరకు 8422 మంది కోలుకుని డిశ్చార్జి కాగా.. 10043మంది చికిత్స పొందుతున్నారు. కొత్తగా నమోదు అయిన కేసుల్లో అనంతపురంలో 87, చిత్తూరులో 74, ఈస్ట్‌ గోదావరిలో 118, గుంటూరులో 157, కడపలో 52, కృష్ణలో 62, కర్నూలులో 97, నెల్లూరులో 45, ప్రకాశంలో 27, విశాఖపట్నంలో 88, విజయనగరంలో 18, పశ్చిమ గోదావరిలో 40 చొప్పున కేసులు నమోదు అయ్యాయి.



Next Story