ఏపీలో కొత్తగా 845 పాజిటివ్ కేసులు
By తోట వంశీ కుమార్ Published on 2 July 2020 2:10 PM ISTఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 14,285 సాంపిల్స్ని పరీక్షించగా.. కొత్తగా 845 మందికి పాజిటివ్గా నిర్థారణ అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తాజా బులిటెన్లో తెలిపింది. వీటిలో రాష్ట్రానికి చెందిన వారు 812 మంది కాగా.. పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 29 మంది.. 4గురు విదేశాల నుంచి వచ్చినవారు ఉన్నారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 16097కి చేరింది.
ఈ రోజు కొవిడ్ వల్ల శ్రీకాకుళంలో ఒక్కరు. కృష్ణలో ఒక్కరు, గుంటూరులో ఒక్కరు, అనంతపూర్లో ఒక్కరు, కర్నూలులో ఒక్కరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో మృతుల సంఖ్య 198కి చేరింది. మొత్తం నమోదు అయిన కేసుల్లో ఇప్పటి వరకు 7313 మంది కోలుకుని డిశ్చార్జి కాగా.. 8586మంది చికిత్స పొందుతున్నారు. కొత్తగా నమోదు అయిన కేసుల్లో అనంతపురంలో 134, చిత్తూరులో 47, ఈస్ట్ గోదావరిలో 122, గుంటూరులో 104, కడపలో 101, కృష్ణలో 75, కర్నూలులో 75, నెల్లూరులో 02, ప్రకాశంలో 79, విశాఖపట్నంలో 07, విజయనగరంలో 13, పశ్చిమ గోదావరిలో 53 చొప్పున కేసులు నమోదు అయ్యాయి.