ఏపీలో కొత్తగా 813 పాజిటివ్‌ కేసులు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  28 Jun 2020 7:55 AM GMT
ఏపీలో కొత్తగా 813 పాజిటివ్‌ కేసులు

ఏపీలో శరవేగంగా కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 13వేలు దాటింది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 25,778 సాంపిల్స్‌ని పరీక్షించగా.. కొత్తగా 813 మందికి పాజిటివ్‌గా నిర్థారణ అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తాజా బులిటెన్‌లో తెలిపింది. వీటిలో రాష్ట్రానికి చెందిన వారు 755 మంది కాగా.. పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 50 మంది.. 8మంది విదేశాల నుంచి వచ్చినవారు ఉన్నారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 13098కి చేరింది.

ఈ రోజు కొవిడ్‌ వల్ల కృష్ణలో ఐదుగురు, కర్నూల్‌లో ఆరుగురు, పశ్చిమగోదావరిలో ఒక్కరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో మృతుల సంఖ్య 169కి చేరింది. మొత్తం నమోదు అయిన కేసుల్లో ఇప్పటి వరకు 5908 మంది కోలుకుని డిశ్చార్జి కాగా.. 7021మంది చికిత్స పొందుతున్నారు. కొత్తగా నమోదు అయిన కేసుల్లో అనంతపురంలో 51, చిత్తూరులో 82, ఈస్ట్‌ గోదావరిలో 57, గుంటూరులో 90, కడపలో 111, కృష్ణలో 79, కర్నూలులో 103, నెల్లూరులో 18, ప్రకాశంలో 41, విశాఖపట్నంలో 44, విజయనగరంలో 08, పశ్చిమ గోదావరిలో 71 చొప్పున కేసులు నమోదు అయ్యాయి.



Next Story