ఏపీలో విజృంభిస్తున్న కరోనా.. కొత్తగా 376 కేసులు
By తోట వంశీ కుమార్Published on : 19 Jun 2020 2:40 PM IST

ఏపీలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజు రోజుకు కేసుల సంఖ్య పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 17,609 సాంపిల్స్ని పరీక్షించగా.. కొత్తగా 376 మందికి పాజిటివ్గా నిర్థారణ అయ్యింది. వీటితో కలిపి రాష్ట్రంలో 6230 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కోవిడ్ వల్ల కృష్ణాలో ఇద్దరు, ప్రకాశంలో ఒకరు, శ్రీకాకుళంలో ఒకరు మరణించారు. దీంతో ఈ మహమ్మారి భారీన పడి మరణించిన వారి సంఖ్య 96 మంది మరణించారు. మొత్తం నమోదు అయిన కేసుల్లో 3065 మంది కోలుకుని డిశ్చార్జి కాగా.. 3069 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
Also Read
కరోనా పరీక్షల్లో ఏపీ మరో రికార్డ్Next Story