ఏపీలో పెరిగిన కరోనా కేసులు.. కొత్తగా మరో 70 కేసులు
By తోట వంశీ కుమార్ Published on 30 May 2020 2:08 PM ISTఏపీలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 9,504 సాంపిల్స్ ను పరీక్షించగా.. కొత్తగా మరో 70 పాజిటివ్ కేసులు నిర్థారణ అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తాజా బులిటెన్లో వెల్లడించింది. కొత్తగా నమోదైన కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2944 కి చేరింది. ఈ మహమ్మారి వల్ల 60 మంది మృత్యువాత పడ్డారు.
మొత్తం నమోదు అయిన కేసుల్లో ఇప్పటి వరకు 2092 మంది డిశ్చార్జి కాగా.. 792 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. విదేశాల నుంచి ఏపీకి వచ్చిన వారిలో 111 మందికి కరోనా సోకింది. ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి వచ్చిన వారిలో 406 మంది కరోనా బారినపడినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది.
Next Story