ఏపీలో ఆగ‌ని క‌రోనా విజృంభ‌ణ‌.. కొత్త‌గా 54 కేసులు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  28 May 2020 11:38 AM IST
ఏపీలో ఆగ‌ని క‌రోనా విజృంభ‌ణ‌.. కొత్త‌గా 54 కేసులు

ఏపీ‌లో క‌రోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. గ‌డిచిన 24 గంటల్లో 9,858 సాంపిల్స్ ను ప‌రీక్షించ‌గా.. కొత్త‌గా మ‌రో 54 పాజిటివ్ కేసులు నిర్థార‌ణ అయిన‌ట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తాజా బులిటెన్‌లో వెల్ల‌డించింది. కొత్త‌గా న‌మోదైన కేసుల‌తో క‌లిపి రాష్ట్రంలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2841 కి చేరింది. ఈ మ‌హ‌మ్మారి బారీన ప‌డి 59 మంది మృతి చెందారు. మొత్తం న‌మోదు అయిన కేసుల్లో ఇప్ప‌టి వ‌ర‌కు 1958 మంది డిశ్చార్జి కాగా.. 824 మంది ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతున్నారు.

AP corona cases rise to 2814

Next Story