ప్రధాని మోదీతో ముగిసిన ఎపీ సీఎం జగన్ భేటీ
By న్యూస్మీటర్ తెలుగు Published on 6 Oct 2020 12:15 PM ISTప్రధాని నరేంద్ర మోదీతో ఎపీ సీఎం జగన్ భేటీ ముగిసింది. దాదాపు 40 నిమిషాల పాటు ఈ భేటీ కొనసాగింది. రాష్ట్ర అభివృద్ధి అజెండాగా ఈ సమావేశం జరిగింది. రాష్ట్రానికి కేంద్రం అందించాల్సిన సహాయం, చెల్లించాల్సిన బకాయిలు, రాష్ట్ర విభజన హామీలు, తదితర 17 అంశాలపై ప్రధాన మంత్రితో సీఎం చర్చలు జరిపినట్లుగా అధికార వర్గాలు తెలిపాయి.
కాగా, భేటీ అనంతరం కేంద్ర జల శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ అధ్యక్షతన ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగే అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ఏపీ జగన్ పాల్గొననున్నారు. ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టాన్ని అనుసరించి జల వివాదాల పరిష్కారానికి వీలుగా కేంద్ర జల శక్తి శాఖ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసింది.
సీఎం జగన్ వెంట ఎంపీలు వి.విజయసాయిరెడ్డి, పీవీ మిథున్రెడ్డి, మార్గాని భరత్, బాలశౌరి, వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి, మోపిదేవి వెంకటరమణారావు ఉన్నారు.