అమరావతి: వైఎస్ఆర్ సీపీపై ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ. రంగులు వేసుకోవడానికి, ఆర్భాటం చేయడానికి తప్ప రూలింగ్ చేయడానికి వైఎస్ఆర్ సీపీ పనికి రావడంలేదన్నారు.150 సీట్లు ఇచ్చినందుకు రిటర్న్ గిఫ్ట్ గా ఇసుక కొరత సృష్టించారు.కనీసం రూ.150ల కూలీ కూడా లేకుండా పోయిందన్నారు. భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి లేకుండా చేశారని ఆరోపించారు. ఇంత అసమర్ధ ప్రభుత్వాన్ని తానెప్పుడు చూడలేదని ట్విట్ చేశారు కన్నా.