ఏపీలో కూటమి ప్రభుత్వ పాలనపై వైఎస్సార్సీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. అంతేకాకుండా నేడు ఓ బుక్ కూడా రిలీజ్ చేశారు. 'జగన్ అంటే నమ్మకం.. చంద్రబాబు అంటే మోసం' పేరుతో పుస్తకాన్ని వైసీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు అంబటి రాంబాబు, విడదల రజని తదితరులు పాల్గొన్నారు. కూటమి ఏడాది పాలనంతా విధ్వంసమేనని, కూటమి ప్రభుత్వం ఒక్క హామీని కూడా అమలు చేయలేదన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. రెడ్బుక్ రాజ్యాంగాన్నే అమలు చేశారని, దీనికి వాస్తవాలు, ఆధారాలతో వైఎస్సార్సీపీ పుస్తకాన్ని తెచ్చామన్నారు. ఐదు కోట్ల మంది ప్రజలకు చంద్రబాబు ఎలా వెన్నుపోటు పొడిచారో ఈ బుక్ లో వివరించామని తెలిపారు.