క్షేత్రస్థాయిలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి: బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి

వైసీపీ సీనియర్‌ నేత, రాష్ట్ర మాజీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.

By Medi Samrat
Published on : 24 April 2025 7:09 PM IST

క్షేత్రస్థాయిలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి: బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి

వైసీపీ సీనియర్‌ నేత, రాష్ట్ర మాజీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. కేంద్రంలో మద్దతు ఉందని చెప్పుకుంటున్నా, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిలో ఎటువంటి సానుకూల మార్పు కనిపించడం లేదని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుత కూటమి ప్రభుత్వం సంపద సృష్టిలో వెనుకబడి, అప్పులు చేయడంలో మాత్రం ముందుందని ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదైనా ఆర్థిక పరిస్థితి మెరుగుపడలేదని అన్నారు.

ప్రభుత్వ అప్పుల లెక్కలపై ప్రజల్లో గందరగోళం నెలకొందని, అప్పుల గణాంకాలను కొందరు 'మట్కా లెక్కల' మాదిరిగా చెబుతున్నారని ప్రజలు అనుకుంటున్నారన్నారు. సంపద సృష్టిస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వంపై ప్రజలు ముఖ్యమంత్రి చంద్రబాబు అనుభవం దృష్ట్యా నమ్మకం ఉంచారని, కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయన్నారు. వైసీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికి రాష్ట్ర పన్నుల ఆదాయం రూ. 81,400 కోట్లుగా ఉందని, ప్రస్తుత కూటమి ప్రభుత్వ ఆదాయం, తమ హయాంతో పోలిస్తే 7.5 శాతం తక్కువగా ఉందని అన్నారు. సంపద సృష్టి తగ్గిపోయిందని ఆరోపించారు. తాము సామాన్య ప్రజల సంక్షేమం కోసం పాలన సాగించామని, వైసీపీ అప్పులు చేసిందని విమర్శించే కూటమి ప్రభుత్వం, అంతకంటే ఎక్కువ అప్పులు చేసి ఆ నిధులను ఎవరికి పంచుతోందని ప్రశ్నించారు.

Next Story