ఇప్పుడు రాష్ట్రం శ్రీలంక అవ్వదా.? : మాజీ మంత్రి బుగ్గన

ఆంధ్రప్రదేశ్ లోని కూటమి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం కంటే ఎక్కువ అప్పులు చేస్తూ వెళుతోందని, ఇప్పుడు రాష్ట్రం శ్రీలంక అవుతుందని కొందరు కూడా మాట్లాడడం లేదని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ అన్నారు.

By Medi Samrat
Published on : 15 Jun 2025 6:27 PM IST

ఇప్పుడు రాష్ట్రం శ్రీలంక అవ్వదా.? : మాజీ మంత్రి బుగ్గన

ఆంధ్రప్రదేశ్ లోని కూటమి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం కంటే ఎక్కువ అప్పులు చేస్తూ వెళుతోందని, ఇప్పుడు రాష్ట్రం శ్రీలంక అవుతుందని కొందరు కూడా మాట్లాడడం లేదని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ అన్నారు. టీడీపీకి పునాది సినిమా ఫీల్డ్ అందుకే పథకాల పేర్లు బాగుంటాయన్నారు. యువగలం పేరుతో యువకులను మోసం చేశారని, 20 లక్షల మంది యువకులను మోసం చేశారని విమర్శించారు.

తల్లికి వందనం పేరుతో కూటమి సర్కార్‌ మహా మోసం చేస్తోందని ఆరోపించారు బుగ్గన రాజేంద్రనాథ్‌. మీకు 15వేలు, మీకు 18వేలు ఇస్తామని ఎన్నికల ముందు చెప్పి ఇప్పుడు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. కుటుంబంలో ఎంత మంది పిల్లలున్నా తల్లికి వందనం ఇస్తామన్నారు, ఏమైంది? తల్లికి వందనం పేరుతో కూటమి సర్కార్‌ మహా మోసం చేస్తోందన్నారు. 3000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇవ్వడం లేదని ఆరోపించారు బుగ్గన. రాష్ట్రంలో దాదాపు 88 లక్షల మంది విద్యార్థులకు తల్లికి వందనం ఇవ్వాలని, ఆంక్షలతో పిల్లల సంఖ్య 66 లక్షలకు తగ్గించే కుట్ర చేస్తున్నారన్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే చంద్రబాబుకు ఇష్టం ఉండదు. అది ప్రజలు అయినా ప్రతిపక్షం అయినా సరే అని బుగ్గన విమర్శించారు.

Next Story