జగన్ అన్నది ధ‌గా ప్రభుత్వం : వైఎస్ షర్మిల

ఒక చేత్తో మట్టి చెంబు ఇస్తూ.. మరో చేత్తో వెండి చెంబు తీసుకుంటున్నారని APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి అధికార వైసీపీపై ఆరోప‌ణ‌లు గుప్పించారు.

By Medi Samrat  Published on  8 Feb 2024 1:19 PM GMT
జగన్ అన్నది ధ‌గా ప్రభుత్వం : వైఎస్ షర్మిల

ఒక చేత్తో మట్టి చెంబు ఇస్తూ.. మరో చేత్తో వెండి చెంబు తీసుకుంటున్నారని APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి అధికార వైసీపీపై ఆరోప‌ణ‌లు గుప్పించారు. గుంటూరు జిల్లా తెనాలి నియోజక వర్గం కొలకలూరు గ్రామంలో జ‌రిగిన‌ రచ్చబండ కార్య‌క్ర‌మంలో ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వ పథకాలు ఏవీ ప్రజలకు అందడం లేదన్నారు. ఉద్యోగాలు లేవు.. ఫీజు రీయింబర్స్మెంట్ లేదు.. జాబ్ క్యాలెండర్ అని చెప్పి మోసం చేశారు.. మెగా డీఎస్సీ అని చెప్పి మోసం చేశారని దుయ్య‌బ‌ట్టారు. చంద్రబాబు 7 వేల పోస్టులు ఇస్తే హేళన చేశాడు. వైసీపీ వస్తె 25 వేల పోస్టులు ఇస్తా అన్నారు. మెగా డీఎస్సీని ధ‌గా డీఎస్సీ చేశాడని ఎద్దేవా చేశారు. 25 వేలు అని చెప్పి ఎన్నికల ముందు 6 వేల పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చారని ఫైర్ అయ్యారు.

ఉద్యోగాలు లేక ఇతర రాష్ట్రాలకు వలసలు పెరిగాయన్నారు. మన బిడ్డలు ఇక్కడ ఉద్యోగాలు లేకుండా వలసలు పోవాలా.? అని ప్ర‌శ్నించారు. 25 లక్షల ఇండ్లు అని చెప్పి ఒక్కరికీ ఇళ్ళు ఇవ్వలేదన్నారు. జగన్ అన్నది ధ‌గా ప్రభుత్వమ‌ని విమ‌ర్శించారు. మన బిడ్డల భవిష్యత్ మారాలి. ఉద్యోగాలు ఇచ్చే కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి. దోచుకునే ప్రభుత్వాలు పోవాలన్నారు. మాఫియాలు చేసే ప్రభుత్వం పోవాలని అన్నారు.

ఎన్నికలు వస్తున్నాయి ..ఎవరు ఎన్ని డబ్బులు ఇస్తే అన్ని తీసుకోండి. అవన్నీ మీ డబ్బులే.. చుట్టూ ఇసుక మాఫియాతో సంపాధించిన డబ్బులే.. కానీ రాష్ట్రం అభివృద్ధి చేసే పార్టీకి మాత్రమే ఓటు వేయాలన్నారు. చంద్రబాబుకి ఇచ్చిన అవకాశం చాలు.. జగన్ ఆన్నకు ఇచ్చిన అవకాశం చాలు.. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. హోదా ఇస్తామని స్వయంగా రాహుల్ హామీ ఇచ్చార‌ని.. మొదటి సంతకం పెడతా అని చెప్పార‌ని.. కాంగ్రెస్ పార్టీని నమ్మాలి.. ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి పని చేసిన పార్టీ అని పేర్కొన్నారు.

నన్ను నమ్మండి..హోదా తెచ్చే బాధ్యత నాదన్నారు. పోలవరం పూర్తి కావాలి... రాజధాని కట్టాలి.. TDP, YCP బీజేపీకి తోక పార్టీలన్నారు. భూమి హక్కుల చట్టం పేరుతో సర్కార్ భూ కబ్జాలకు పాల్పడే చట్టం తేవాలని అనుకుంటుంది. ఇప్పటికే లిక్కర్ ను సర్కార్ బిజినెస్ చేశారు. కొత్త చట్టంతో భూ కబ్జాలు కూడా సర్కార్ చేయబోతుందన్నారు. లిక్కర్ పేరుతో.. చెప్పిన మద్యాన్ని మాత్రమే అమ్మాలని రూల్ తెచ్చారు. రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం మొత్తం దోచేశారని ఆరోపించారు. రాష్ట్రంలో కల్తీ లిక్కర్ తో 25 శాతం అదనంగా మరణాలు సంభవిస్తున్నాయని ఆరోపించారు. లిక్కర్ వ్యాపారం గుప్పిట్లో పెట్టుకున్నట్లు.. ప్రజల భూములను గుప్పిట్లో పెట్టుకోవాలని చూస్తుందన్నారు.

ఒక మనిషిని పెడతారట.. ఆయన చెప్పినట్లే భూ లావాదేవీలు ఉండాలట.. ఇదేం చట్టం.. భూములపై సొంత హక్కులు హరించే చట్టం తేవడం ఎంటి..? అని ప్ర‌శ్నించారు. ఇలాంటి చట్టాలు తెచ్చే YCP ప్రభుత్వం మళ్ళీ రావాలా.? ప్రజలు తేల్చుకోవాలన్నారు. లాండ్ టైటిల్ యాక్ట్.. వ్యతిరేకిస్తున్నామ‌న్నారు. రాష్ట్రంలో అన్ని ధరలు పెంచారు.. చక్కెర, నూనె, కూరగాయలు అన్ని పెంచారు.. ఈ ప్రభుత్వం ఆదుకొనే ప్రభుత్వం కాదన్నారు. 12 వేలు అమ్మఒడి అని చెప్పారు.. ఒక్క బిడ్డకు మాత్రమేనట.. ఎన్నికల్లో జగన్ ఆన్న తరుపున నేనే ప్రచారం చేశా.. అందరికీ ఇస్తాం అని చెప్పా.. జగన్ ఆన్న ఆ హామీ నిలబెట్టుకోలేద‌ని అన్నారు.

Next Story